Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
Iran-Israel War: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని, దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న తటస్థ విదేశీ విధానానికి ఇది విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఒవైసీ తీవ్ర విమర్శలు..
1. పశ్చిమాసియా విధానంలో మార్పు: భారత్ గత ఎనిమిది దశాబ్దాలుగా పశ్చిమాసియా వ్యవహారాల్లో సమతుల్యమైన మరియు తటస్థ వైఖరిని అవలంబిస్తోందని ఒవైసీ గుర్తు చేశారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని ఇజ్రాయెల్ను సందర్శించడం ద్వారా ఆ సమతుల్యతను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
2. 10 మిలియన్ల భారతీయుల భద్రత: గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, ఈ పర్యటన వల్ల ఆ ప్రాంతంలో భారత్ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అక్కడ ఉన్న భారతీయుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆయన అన్నారు.
3. దౌత్యపరమైన వైఫల్యం: ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై దాడులు జరగడంపై ఒవైసీ స్పందిస్తూ.. “ప్రధాని విమానం గాల్లో ఉన్నప్పుడే ఈ దాడులు జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహించేవారు?” అని ప్రశ్నించారు. ఈ పర్యటనను ఇజ్రాయెల్ తన రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన విమర్శించారు.
4. ముందస్తు సమాచారంపై ప్రశ్న: ఇరాన్పై దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు భారత్కు ముందస్తు సమాచారం ఇచ్చారా? లేదా అన్నది స్పష్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఒకవేళ తెలిసినా పర్యటనకు వెళ్లడం అనాలోచితమని, తెలియకుండా వెళ్లి ఉంటే ఇజ్రాయెల్ భారత్ను మోసం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన కొద్దిసేపటికే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ప్రధాని మోడీ పర్యటన కవరేజ్ కోసం వెళ్లిన భారత మీడియా ప్రతినిధులు ఇజ్రాయెల్లోనే చిక్కుకున్నట్లు ఒవైసీ విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు అంచనా లోపించిందని ఆరోపించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ఒవైసీ కేవలం వార్తల్లో నిలవడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!