Meerpet Boy Missing Case: ఏంట్రా బుడ్డోడా అలా వెళ్లిపోయావ్.. పరుగులు పెట్టించావ్ కదరా..
- మీర్ పేట్ లో అదృశ్యమైన బాలుడు క్షేమం ..
- తిరుపతిలో ప్రత్యక్షమైన బాలుడు..
- సీసీ కెమెరా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerpet Boy Missing Case: పిల్లలు ఏదైనా వస్తువు కావాలంటే అది ఇచ్చేంత వరకు మారం చేస్తూనే వుంటారు. ఈకాలం పిల్లలు కొన్నివిషయాల్లో అవలంబిస్తున్నా మొండి వైఖరి వారి ప్రాణాలకే కాదు.. కుంటుంబాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. దీంతో తల్లిదండ్రులు గారాబంతో అడిగిందల్లా కాదనకుండా ఇవ్వడంతో పిల్లల పేచీ మరి ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో కావాలన్నిది ఇవ్వలేదని కొందరు పిల్లలు చేసే పనులు కుటుంబాన్ని కంగారు పడేలా చేస్తున్నాయి. ఓ బుడ్డోడు చేసిన పనికి అటు పోలీసులకు ఇటు తల్లిదండ్రులకు కంగారు పడేలా చేసింది. చదువుకోవడం ఇష్టం లేదో లేక తిరుపతికి తీసుకుని వెళ్లిమని అమ్మనాన్నను అడిగినా పట్టించుకోలేదో తెలియదు కానీ.. ఈ బుడ్డోడు చేసిన పని అందిరిని పరుగులు పెట్టించింది. మిస్సయిన బాలుడు తిరుపతిలో ఆచూకీ లభ్యం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈనెల 4వ తేదీన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: House Collapsed : కాశీ విశ్వనాథ దేవాలయం సమీపంలో కూలిన ఇళ్లు.. ఎనిమిది మంది సమాధి
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ఈ నెల 4వ తేదీ సాయంత్రం నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఇంటి నుంచి తండ్రి 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు మహీధర్రెడ్డిని ట్యూషన్ లో వదిలి వెళ్లాడు. అక్కడ నుంచి బాలుడు మహీధర్రెడ్డి బయటకు వచ్చి ట్రైన్ టికెట్ తీసుకుని ఏకంగా తిరుపతికి చెక్కేశాడు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకున్నాడో ఏమో గానీ తిరుపతికి చేరుకున్నాడు. అయితే ఇక్కడి వరకు బుడ్డోడి కథ వుంటే.. ఇక కొడుకు ఇంటికి రాకుండా తల్లిదండ్రుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇంట్లో అందరూ కంగారు పడి పోలీస్టేషన్ కు చేరుకుని మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి తిగిన మీర్పేట్ పోలీసులు బాలుడి ఆచూకీ కోసం అక్కడ వున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ట్యూషన్ నుంచి మహీధర్రెడ్డి ఓ వ్యక్తితో బైక్ పై వెలుతున్నట్లు కనిపించాడు.
Read also: Bangladesh Protest : మరో సారి షేక్ హసీనా ప్రాణాలను కాపాడిన భారతదేశం
మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అని అచూకీ లభ్యం కాలేదు. అనంతరం మలక్ పేట్ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ప్రత్యక్షమైంది. అక్కడ టికెట్ తీసుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడో పోలీసులు వెతకడం ప్రారంభించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే బాలుడి ఆచూకీ తిరుపతిలో దొరకడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతిలో బాలుడు వున్నాడని కుటుంబసభ్యులకు తెలియడంతో అందరూ తిరుపతికి బయలు దేరి బాలుడి వద్దకు చేరుకున్నారు. పోలీసులు బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే బాలుడు ఎందుకు తిరుపతికి వెళ్ళాడు? అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరి కొందరు అయితే ఏంట్రా బుడ్డోడా తిరుపతికి అలా వెళ్లిపోయావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అందరిని పరుగులు పెట్టించావ్ కదరా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
We Hub: వీ హబ్ లో భారీ పెట్టుబడులు.. స్టార్టప్ లలో మరో రూ.839 కోట్లు..
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!