Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- చాలా బాధాకరమైన విషయం జరిగింది
- మీనాక్షి గెలుస్తారని అనుకున్నా
- నాది బూటకపు కేసు కాదు
- ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్లో దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కేసు ప్రస్తావించలేదన్న సాకు తిరస్కరించారు. అనంతరం ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్ కావడంతో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి సుప్రీంకోర్టు కూడా విచారణకు నిరాకరించింది. దీంతో మీనాక్షి నటరాజన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
తాజాగా ఇదే వ్యవహారంపై ఫిర్యాదుదారు శ్రీలత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు బలహీనపరచబడిందని ఆమె ఆరోపించారు. “చాలా బాధాకరమైన విషయం జరిగింది. ఆమె గెలుస్తారని అనుకున్నా. 2022లో కుంభం శివకుమార్ రెడ్డి వేధింపులకు పాల్పడ్డారని నేను ఫిర్యాదు చేశాను. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. అయితే దాన్ని కొందరు తప్పుడు కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నారు. తన కేసును రాజకీయ ఒత్తిళ్లతో మూసివేశారని, సాక్ష్యాలు లేవనే కారణంతో దర్యాప్తును బలహీనపరిచారని ఆరోపించారు. “శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్కు ఎన్నో సందేశాలు పంపాను. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని వాపోయారు.
Also Read
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
అనంతరం తాను మీనాక్షి నటరాజన్ను కలిసి శివకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖ గురించి అడిగినట్లు తెలిపారు. ‘‘ఆయన ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని ఆమె చెప్పారని. అయితే సస్పెండ్ అయిన వ్యక్తి అధికారిక పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నాడని నేను ప్రశ్నించాను” అని శ్రీలత అన్నారు. తన కేసును దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన శ్రీలత.. “నన్ను పార్టీకి దూరంగా ఉండమని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారు? నేను పార్టీ సభ్యురాలిని కాదంటే అందుకు సంబంధించిన అధికారిక లేఖ చూపించాలి. అదే కారణంతో నేను కోర్టును ఆశ్రయించాను” అని చెప్పుకొచ్చారు.
కోర్టు విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని కూడా ఆమె ఆరోపించారు. “సుమారు 50 మంది.. కొందరు న్యాయవాదులు, కాంగ్రెస్ నేతలు, వంశీ చంద్ రెడ్డి కోర్టు హాల్లో ఉన్నారు. ఇది న్యాయ ప్రక్రియపై ప్రభావం చూపే ప్రయత్నంలా అనిపించింది” అని అన్నారు. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని శ్రీలత స్పష్టం చేశారు.
#WATCH | Hyderabad, Telangana: The complainant of the pending criminal case against Meenakshi Natarajan, that she had allegedly failed to disclose in her Rajya Sabha nomination papers, Srilatha says, "A very sad thing has happened… I thought that she would win at least in the… pic.twitter.com/RlyQc6WLv8
— ANI (@ANI) June 12, 2026
తాజావార్తలు
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
-
Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!