VC.Sajjanar: మహిళా కండక్టర్ కు ఎండీ సజ్జనార్ అభినందనలు.. కారణం ఇదీ..
- మహిళా కండక్టర్ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు..
- బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని అభినందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC.Sajjanar: మహిళా కండక్టర్ కు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా బస్సులో గర్భిణిపై పురుడు పోసిన కండక్టర్ భారతిని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందించారు. కండక్టర్ సకాలంలో డెలివరీ చేయడం, బస్సులోనే నర్సు ప్రయాణం చేస్తుండటంతో ఆమె కూడా సాయం చేయడంతో తల్లీ బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా సేవాభావాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. ప్రయాణంలో ఓ గర్భణీకి పురుడు పోసిన భారతిని సభాష్ అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Read also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
రాఖీ పండుగ రోజు ఓ మహిళా కండక్టర్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో గర్భిణికి ప్రసవం చేసి మానవత్వం ప్రదర్శించింది. తాను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో గర్భణికి పురుడు పోసింది. అనంతరం తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించడంపై సజ్జనార్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇవాళ (సోమవారం) ఉదయం గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో రక్షాబంధనం సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గద్వాల డిపోనకు చెందిన సంధ్య అనే గర్భిణి వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లి చేరుకోగానే గర్బిణికి ఒక్కసారిగా కడుపునొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సు సహాయంతో గర్భిణిని పురుడు చేశారు. ఆ మహిళ పండెంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 సహాయంతో తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!