NTV Telugu Site icon

KTR: రాహుల్, ఖర్గేకి కేటీఆర్ లేఖ..

Ktr

Ktr

KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని కేటీఆర్ తెలిపారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను కేటీఆర్ ఈ లేఖలో పొందుపరుస్తునన్నట్లు వివరించారు. తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు రక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు.

Read also: Bandi Sanjay: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే… వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతామని తెలియజేశారు.
Nirmal: గుండెలు పిండే విషాదం.. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన..