KTR: ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్కు చెప్పండి.. రాహుల్ని కోరిన కేటీఆర్..
- నిన్న మధ్యాహ్నం హీర్యా నాయక్ అనే రైతుకు సంగారెడ్డి జైలులో గుండె నొప్పి..
- కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు..
- గుండె పోటు వచ్చిన వ్యక్తిని బేడీలు వేసి పోలీసు వాహనంలో తరలించారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: లగచర్ల ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులు పూర్తి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ నంది నగర్ లోని తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఒక విషయం కోరుతున్నానని కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులను విడిచి పెట్టమని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని కోరారు. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేస్తారని గుర్తుచేశారు. కానీ రైతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రైతులను ఇలా ఇబ్బందులు పెడితే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం హీర్యా నాయక్ అనే రైతుకు సంగారెడ్డి జైలులో గుండె నొప్పి వచ్చింది అని చెప్పారు.
Read also: KTR: నలభై మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతున్నారు..
Also Read
ఆసుపత్రికి తీసుకెళ్లి కేవలం టెస్ట్ లు చేసి తీసుకు వచ్చారని గుర్తుచేశారు. ఈరోజు ఉదయం మరోసారి హీర్యా నాయక్ కు గుండె పోటు వచ్చిందని అన్నారు. అయినా సరే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. గుండె పోటు వచ్చిన వ్యక్తిని బేడీలు వేసి పోలీసు వాహనంలో తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా నడుపుతున్నారని మండిపడ్డారు. తన మీద దాడి జరగలేదని కలెక్టర్ మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రెస్టీజ్గా ఫీలై.. ఇంత రాద్ధాంతం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతులను చిత్ర హింసలకు గురి చేశారని అన్నారు. నలభై మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదాని కోసం భూములు ఇవ్వమంటే రైతులు ఇవ్వమన్నారని తెలిపారు.
CM Chandrababu: సీఎం కీలక ఆదేశాలు.. వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!