Kaushik Reddy: నాకు 39, నీకు 70 ఏండ్లు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో..
- నీకు దమ్ముంటే రాజీమానా చేసి మళ్లీ పోటీ చేయి..
- BRSలో ఉంటే తెలంగాణ భవన్ కు రా- కాంగ్రెస్ ఎమ్మెల్యేవి అయితే రాజీనామా చేయ్..
- గాంధీ ఇప్పుడు నా ఇంటికి వస్తే మోస్ట్ వెల్కమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: నేను 39 ఏళ్ల యువకుడిని.. గాంధీకి 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అని అరికెపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఉదయం 5 నుంచే నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేశారని తెలిపారు. గాంధీకి సూటిగా అడుగుతున్న.. BRS లోనే ఉన్నానని అంటున్నారు కదా.. నేను మీ పార్టీ సహచర ఎమ్మెల్యేను నేను మీ ఇంటికి వస్తే భయమేంటి అని ప్రశ్నించారు. ఇద్దరం కలిసి BRS కండువా వేసుకుని తెలంగాణ భవన్ తో ప్రెస్ మీట్ పెడుదాం అన్నారు. పార్టీ మారనప్పుడు జెండా వేసుకుంటే తప్పేంటి.! అని ప్రశ్నించారు. రేవంత్ ను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరానని చెప్పావన్నారు. చంద్రబాబును మోసం చేశాం.. కేసీఆర్ ను మోసం చేసావు.. ఈరోజు కాంగ్రెస్ లో చేరావన్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 39 ఏళ్ల యువకుడిని.. 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అని మండిపడ్డారు. కేసీఆర్ ను వ్యతిరేకించిన ఈటెల రాజేందర్ ను హుజూరాబాద్ లో బొందపెట్టిన్నారని గుర్తుచేశారు.
Read also: Edupayala Temple: మరోసారి మూతపడ్డ ఏడు పాయల ఆలయం
Also Read
నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను.. ఎడ నుంచో వచ్చి నాకు సవాల్ విసురుతున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మేడ్చల్ BRS పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో కలిసి గాంధీ ఇంటికి పోదామన్నారు. రేపు పదకొండు గంటలకి మేడ్చల్ పార్టీ ఆఫీస్ నుంచి గాంధీ దగ్గరికి వెళ్తామన్నారు. శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్తామన్నారు. BRS బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడం సిగ్గు అనిపించడం లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూ పంచాయితీలను సెటిల్ చేసుకోవడానికి గాంధీ పార్టీ మారాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నీకు దమ్ముంటే రాజీమానా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. BRSలో ఉంటే తెలంగాణ భవన్ కు రా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేవి అయితే రాజీనామా చేయ్ అన్నారు. గాంధీ ఇప్పుడు నా ఇంటికి వస్తే మోస్ట్ వెల్కమ్ అన్నారు. భోజనం చేసి తెలంగాణ భవన్ కు వెళ్లి ఇద్దరం ప్రెస్ మీట్ పెడుతాం అన్నారు. కేసీఆర్ దగ్గరికి కలిసి వెళ్తాం అన్నారు. మైనంపల్లి హనుమంతరావు కూడా గతంలో కేటీఆర్ ను నోటికి వచ్చింది తిట్టాడు.. చిత్తుగా ఓడిపోయాడు.. నెక్స్ట్ గాంధీనే.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చీరలు గాజుల సంస్కారం రేవంత్ రెడ్డి నేర్పించిందే అన్నారు.
Rajanna Sircilla: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ.. రోడెక్కిన విద్యార్థినిలు
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!