Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య

Couple

Couple

కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా భార్య మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మార్చి 8 2026న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.