K. A. Paul: నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు..
- తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు..
- నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. A. Paul: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో పది మంది ఎమ్మెల్యేలపై కేసు వేశానని.. నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. నన్ను చంపుతామని గతంలో బెదిరించిన వాల్లే పోయారని తెలిపారు. నేను మంచి చేయడానికి వచ్చానని.. నామీద కుట్రలు చేస్తున్నారు.. నాకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నా అన్నారు. నాకు సెక్యూరిటీ దేవుడే అని తెలిపారు. కలలో కూడా మీరు బాగుపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళు కచ్చితంగా చస్తారని తెలిపారు. తెలంగాణా గ్రూప్ వన్ విద్యార్థులు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారని.. వాళ్లకు నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి పోయిందని.. హర్యానా లో 7 హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. అందుకే కాంగ్రెస్ హామీలను హర్యానాలో జనం నమ్మలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రేవంత్ రెడ్డి తో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుందన్నారు.
Read also: Kishan Reddy: మూసీ సుందరీ కరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం న్యాయం కాదు..
Also Read
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
డిల్లీ లిక్కర్ స్కాం లా ఏపి లో లిక్కర్ స్కాం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు, మాజీ మంత్రులు నేరుగా లిక్కర్ దందాలో వాటాల అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 30లోపు నోబెల్ సమ్మిట్ జరగకపోతే నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడం కష్టమన్నారు. ఏపీ సీఎం కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైంది మనకు దరిద్రం ఎక్కువైందన్నారు. ప్రపంచంలో చైనా వద్దు ఇండియా ముద్దంటున్నారు.. ఏపీలో డ్రగ్స్ ప్రొడక్షన్ జరుగుతుందన్నారు. దేశమంత డ్రగ్స్ సప్లై అవుతుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. సౌత్ కొరియా వెళ్లి టూరిస్ట్ గా తిరిగి వచ్చాడు తెలంగాణ సీఎం అన్నారు. మంత్రి కొండా సురేఖ సీఐ కుర్చీలో కూర్చుంటారా? లా ఎక్కడ ఉంది.. ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నించారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ కావాలన్నారు. సుప్రీం కోర్టులో పిల్ వేయబోతున్నానని తెలిపారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళను జీవిత కాలం సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ED Raids On Muda office: మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు..
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్తో అదిరే ఫీచర్లు!
-
Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
-
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!