K. A. Paul: నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు..
- తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు..
- నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపులు..
K. A. Paul: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో పది మంది ఎమ్మెల్యేలపై కేసు వేశానని.. నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. నన్ను చంపుతామని గతంలో బెదిరించిన వాల్లే పోయారని తెలిపారు. నేను మంచి చేయడానికి వచ్చానని.. నామీద కుట్రలు చేస్తున్నారు.. నాకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నా అన్నారు. నాకు సెక్యూరిటీ దేవుడే అని తెలిపారు. కలలో కూడా మీరు బాగుపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళు కచ్చితంగా చస్తారని తెలిపారు. తెలంగాణా గ్రూప్ వన్ విద్యార్థులు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారని.. వాళ్లకు నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి పోయిందని.. హర్యానా లో 7 హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. అందుకే కాంగ్రెస్ హామీలను హర్యానాలో జనం నమ్మలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రేవంత్ రెడ్డి తో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుందన్నారు.
Read also: Kishan Reddy: మూసీ సుందరీ కరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం న్యాయం కాదు..
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
- RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
డిల్లీ లిక్కర్ స్కాం లా ఏపి లో లిక్కర్ స్కాం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు, మాజీ మంత్రులు నేరుగా లిక్కర్ దందాలో వాటాల అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 30లోపు నోబెల్ సమ్మిట్ జరగకపోతే నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడం కష్టమన్నారు. ఏపీ సీఎం కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైంది మనకు దరిద్రం ఎక్కువైందన్నారు. ప్రపంచంలో చైనా వద్దు ఇండియా ముద్దంటున్నారు.. ఏపీలో డ్రగ్స్ ప్రొడక్షన్ జరుగుతుందన్నారు. దేశమంత డ్రగ్స్ సప్లై అవుతుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. సౌత్ కొరియా వెళ్లి టూరిస్ట్ గా తిరిగి వచ్చాడు తెలంగాణ సీఎం అన్నారు. మంత్రి కొండా సురేఖ సీఐ కుర్చీలో కూర్చుంటారా? లా ఎక్కడ ఉంది.. ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నించారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ కావాలన్నారు. సుప్రీం కోర్టులో పిల్ వేయబోతున్నానని తెలిపారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళను జీవిత కాలం సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ED Raids On Muda office: మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు..
తాజావార్తలు
-
LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
-
Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
-
Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
-
Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!