Jishnu Dev Varma: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
- తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
- ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు..
- రాజకుటుంబ నేపథ్యం.. అయోధ్య ఉద్యమంలో పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jishnu Dev Varma: తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. మరికొందరికి స్థాన చలం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొంత మంది మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను భర్తీ చేయనున్నారు. జిష్ణుదేవ్ ఆగష్టు 15, 1957న జన్మించారు. జిష్ణుదేవ్ వర్మ రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఆయన ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: Astrology: జులై 28, ఆదివారం దినఫలాలు
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
- Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
- Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
- Smart Ration Cards : గుడ్న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
* హరిబాబు కిషన్రావ్ బాగ్డే రాజస్థాన్ గవర్నర్గా నియమితులయ్యారు.
* తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు.
* ఓం ప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్గా నియమితులయ్యారు.
* సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామన్ దేకా నియమితులయ్యారు.
* సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు.
* అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు.
* సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్గా పంపుతూ.. మణిపూర్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.
Spirituality: రోజూ నిద్ర లేచిన తర్వాత ఇలా చేయండి..అంతా మంచే జరుగుతుంది..!
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!