Jishnu Dev Varma: తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. మరికొందరికి స్థాన చలం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొంత మంది మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను భర్తీ చేయనున్నారు. జిష్ణుదేవ్ ఆగష్టు 15, 1957న జన్మించారు. జిష్ణుదేవ్ వర్మ రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఆయన ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: Astrology: జులై 28, ఆదివారం దినఫలాలు
దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
* హరిబాబు కిషన్రావ్ బాగ్డే రాజస్థాన్ గవర్నర్గా నియమితులయ్యారు.
* తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు.
* ఓం ప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్గా నియమితులయ్యారు.
* సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామన్ దేకా నియమితులయ్యారు.
* సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు.
* అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు.
* సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్గా పంపుతూ.. మణిపూర్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.
Spirituality: రోజూ నిద్ర లేచిన తర్వాత ఇలా చేయండి..అంతా మంచే జరుగుతుంది..!