Jishnu Dev Varma: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
- తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ..
- ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు..
- రాజకుటుంబ నేపథ్యం.. అయోధ్య ఉద్యమంలో పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jishnu Dev Varma: తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. మరికొందరికి స్థాన చలం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొంత మంది మాజీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను భర్తీ చేయనున్నారు. జిష్ణుదేవ్ ఆగష్టు 15, 1957న జన్మించారు. జిష్ణుదేవ్ వర్మ రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఆయన ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: Astrology: జులై 28, ఆదివారం దినఫలాలు
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
* హరిబాబు కిషన్రావ్ బాగ్డే రాజస్థాన్ గవర్నర్గా నియమితులయ్యారు.
* తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు.
* ఓం ప్రకాష్ మాథుర్ సిక్కిం గవర్నర్గా నియమితులయ్యారు.
* సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామన్ దేకా నియమితులయ్యారు.
* సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు.
* అసోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు.
* సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్గా పంపుతూ.. మణిపూర్ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.
Spirituality: రోజూ నిద్ర లేచిన తర్వాత ఇలా చేయండి..అంతా మంచే జరుగుతుంది..!
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?