Janasena: జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీలు రద్దు..
- జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీలు రద్దు..
- కమిటీల స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం..
- క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు.. అయితే, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్ హాక్ కమిటీలు 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గం, GHMC పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Also: Nayanthara: చిరు మూవీతో.. కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార
Also Read
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
- BJP Protest: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట.. తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.!
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచే దిశగా పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించిన పవన్, కమిటీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలికంగా అడ్హాక్ కమిటీలను నియమించారు. ఈ కమిటీలు మొత్తం 30 రోజుల పాటు పనిచేయనున్నాయి. కొత్తగా నియమితులైన అడ్హాక్ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 300 వార్డుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రతి వార్డు నుంచి కనీసం ఐదుగురు చురుకైన సభ్యుల జాబితాను సిద్ధం చేసి, పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావడం వీరి ప్రధాన బాధ్యత. అడ్హాక్ కమిటీ నివేదికలు అందిన తర్వాత, పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేలా కొత్త శాశ్వత కమిటీలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం, బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కేడర్ను మరింత చురుకుగా మార్చి, స్థానిక నాయకత్వాన్ని గుర్తించే దిశగా ఈ చర్యలు తీసుకున్నామని ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడేలా త్వరలోనే కీలక కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీల రద్దు, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం
• తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం
• GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి… pic.twitter.com/s7FFwZChV0— JanaSena Party (@JanaSenaParty) January 5, 2026
తాజావార్తలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!