Etala Rajender: బ్యాంకులు షరతులు లేకుండా పేదలకు రుణాలు ఇవ్వాలి..
- ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలి..
- ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలి..
- దేశం అటువైపు వెళ్ళాలి- ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలి. .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etala Rajender: పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు. ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలని తెలిపారు. దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు. పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్. విద్యానగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అని తెలిపారు. ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారని అన్నారు. తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని అన్నారు. భారతదేశం యువశక్తి గల దేశం.. ఆ యువశక్తి పాన్ డబ్బాల దగ్గర ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తుందని తెలిపారు. ప్రోత్సాహకాలు అందిస్తుందని.. నా తపన కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. స్వయంశక్తి మీద బ్రతికేలా చేయడం అని తెలిపారు. పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. పెద్దలు బ్యాంక్ రుణాలు ఎగ్గొడుతున్నారేమో కానీ మన మహిళా సంఘాలు 98 శాతం రిపేమెంట్ చేస్తున్నాయన్నారు.
Read also: Hyderabad: నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్..
Also Read
నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలి. దీనికోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆరాటపడ్డానని తెలిపారు. వృత్తి పనులు చేసే వారు సమాజం మేలు చేసేవారన్నారు. చేతి వృత్తుల వారు జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణానికి తోడ్పడే వాళ్ళు. వారికి ఏం ఇచ్చినా తక్కువే అన్నారు. చేతి వృత్తుల వారి పట్ల మన మైండ్ సెట్ మారాలి. వారిపట్ల చిన్న చూపు తగదన్నారు. ఆపదలో ఉన్నవాడికి అవసరం ఉన్నవాడికి సాయం చేసేవాడే నిజమైన మనిషి అని తెలిపారు. 77 సంవత్సరాల తరువాత కూడా ఈ దేశంలో పేదరికం ఉంది, ఆకలి ఉందనే ప్రధాని నరేంద్ర మోడీ గారు పీఎం విశ్వకర్మలాంటి స్కీంలు తీసుకువచ్చారన్నారు. ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలన్నారు. ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలన్నారు. దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు అందించారన్నారు.
Hyderabad Student: ఫిలిప్పీన్స్ లో నిజామాబాద్ విద్యార్థి మృతి..
తాజావార్తలు
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!