Telangana Assembly 2024: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 19 పద్దులపై చర్చ..
- ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ..
- సభలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు..
- తర్వాత బడ్జెట్ లోని పద్దులపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly 2024: నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. నిన్నటి సమావేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, అధికార పార్టీ మధ్య మాటల యుద్దం జరిగింది. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. నిన్న 17 గంటలకు పైగా శాసనసభ సాగింది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు మండలిలో సమస్యలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో తొమ్మిది శాఖల సమస్యలపై చర్చించనున్నారు. మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.
Read also: Rythu Runa Mafi: నేడు రెండో విడత రైతు రుణమాఫీ.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ..
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్లపై సభ్యులు చర్చించనున్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్పై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అసెంబ్లీ వేదికగా జరగనుంది. లక్షన్నర వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం నేడు మాఫీ చేయనుంది. రెండో దశలో 7 లక్షల మంది రైతులకు 6100 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన కట్ మోషన్పై నిన్న తెలంగాణ శాసనసభలో పెద్ద దుమారమే రేగింది. బిఆర్ఎస్ కట్ మోషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. కోత మోషన్లను చేపట్టకుండా కోతలను ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. గతంలో కట్ మోషన్లను పద్దుల చేపట్టి ఆమోదించకుండానే బుల్ డోజర్లు వేశారు. తాము ప్రజాస్వామ్యవాదులమని, అన్నింటికీ సమాధానం చెబుతామన్నారు. ప్రతిపక్షాలు మాకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. నిన్నటితో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడివేడి చర్చ ముగిసింది. ఆయా సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆర్థిక మంత్రి సభలో సవివరంగా వివరణ ఇచ్చారు.
Delhi Incident : ‘ఎక్కడున్నారు సార్’..అర్ధరాత్రయినా ఆగని విద్యార్థుల నిరసనలు..
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
-
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..