Telangana: 11ఏళ్లకు దక్కిన న్యాయం.. తల్లిని చంపిన కేసులో జైల్లోనే కొడుకు మృతి..
- 11 ఏళ్లకు దక్కిన బాధితుడికి న్యాయం..
- జైల్లో శిక్ష అనుభవిస్తూ 5 సంవత్సరాల క్రితమే మృతి చెందిన బాధితుడు..
- న్యాయ ప్రక్రియ ఆలస్యంపై మరోసారి ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెయిల్ పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్ల విచారణలో జాప్యం కారణంగా, చాలా మంది ఖైదీలు న్యాయం పొందకముందే జైలులో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Read also: KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల అలియాస్ గుండెల పోచయ్య 2013లో తన తల్లి ఎల్లవ్వను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. వృద్ధురాలిని చూసుకోలేక చెట్టుకు టవల్ తో ఉరివేసి హత్య చేశాడన్న ఆరోపణలపై దుబ్బాక పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం ఆధారాలను పరిశీలించిన సిద్దిపేట కోర్టు పోచయ్యకు 2015 జనవరి 12న జీవిత ఖైదు విధిస్తూ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అదే ఏడాది పోచయ్య చిన్న కుమారుడు దేవయ్య అలియాస్ డేవిడ్ హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ సమయంలో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయగా, హైకోర్టు దానిని తిరస్కరించింది. ఈ ఏడాది జులైలో ఈ అప్పీల్ను విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా ప్రకటిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
Read also: Konda Surekha: వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..
అయితే ఆరేళ్ల క్రితమే చనిపోయాడని తెలియడంతో ఆ వార్త అందరికి షాక్ కు గురిచేసింది. 2018 ఆగస్టు 15న చర్లపల్లి బహిరంగ జైలులో పోచయ్య అస్వస్థతకు గురికావడంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. 16న కుటుంబ సభ్యులు జైలుకు చేరుకోగా.. అప్పటికే మృతి చెందినట్లు జైలు సిబ్బంది తెలిపారు. చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోచయ్య చిన్న కుమారుడు డేవిడ్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్, విచారణ అధికారి సాక్ష్యాధారాలతో కింది కోర్టు శిక్ష విధించడం సరికాదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. చనిపోయిన ఖైదీల కేసుల వివరాలు కూడా జైలు అధికారుల వద్ద ఉన్నాయని, మరణ సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!