Telangana: 11ఏళ్లకు దక్కిన న్యాయం.. తల్లిని చంపిన కేసులో జైల్లోనే కొడుకు మృతి..
- 11 ఏళ్లకు దక్కిన బాధితుడికి న్యాయం..
- జైల్లో శిక్ష అనుభవిస్తూ 5 సంవత్సరాల క్రితమే మృతి చెందిన బాధితుడు..
- న్యాయ ప్రక్రియ ఆలస్యంపై మరోసారి ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెయిల్ పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్ల విచారణలో జాప్యం కారణంగా, చాలా మంది ఖైదీలు న్యాయం పొందకముందే జైలులో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Read also: KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల అలియాస్ గుండెల పోచయ్య 2013లో తన తల్లి ఎల్లవ్వను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. వృద్ధురాలిని చూసుకోలేక చెట్టుకు టవల్ తో ఉరివేసి హత్య చేశాడన్న ఆరోపణలపై దుబ్బాక పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం ఆధారాలను పరిశీలించిన సిద్దిపేట కోర్టు పోచయ్యకు 2015 జనవరి 12న జీవిత ఖైదు విధిస్తూ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అదే ఏడాది పోచయ్య చిన్న కుమారుడు దేవయ్య అలియాస్ డేవిడ్ హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ సమయంలో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయగా, హైకోర్టు దానిని తిరస్కరించింది. ఈ ఏడాది జులైలో ఈ అప్పీల్ను విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా ప్రకటిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
Read also: Konda Surekha: వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..
అయితే ఆరేళ్ల క్రితమే చనిపోయాడని తెలియడంతో ఆ వార్త అందరికి షాక్ కు గురిచేసింది. 2018 ఆగస్టు 15న చర్లపల్లి బహిరంగ జైలులో పోచయ్య అస్వస్థతకు గురికావడంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. 16న కుటుంబ సభ్యులు జైలుకు చేరుకోగా.. అప్పటికే మృతి చెందినట్లు జైలు సిబ్బంది తెలిపారు. చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోచయ్య చిన్న కుమారుడు డేవిడ్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్, విచారణ అధికారి సాక్ష్యాధారాలతో కింది కోర్టు శిక్ష విధించడం సరికాదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. చనిపోయిన ఖైదీల కేసుల వివరాలు కూడా జైలు అధికారుల వద్ద ఉన్నాయని, మరణ సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
తాజావార్తలు
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!