Jubilee Hills By-Election: ఆ తర్వాతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..!
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఫోకస్..
- ఇంఛార్జ్ మంత్రులకు మూడు రోజుల గడువు పెట్టిన సీఎం రేవంత్..
- ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్ధి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది పార్టీ. సీఎం రేవంత్ నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు… మార్చి 8 న కోర్టు ఎపిసోడ్ పై చర్చించారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ నెల 6 న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై పార్టీ చర్చించింది. అభ్యర్ధి ఎంపికపై ఇంచార్జి మంత్రులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జ్ వివేక్.. తుమ్మల నాగేశ్వరరావు లకు రెండు మూడు రోజుల్లో రేసులో ఉన్న అభ్యర్ధులు… గ్రౌండ్ లో బలం ఉన్న అభ్యర్ధుల జాబితా ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్.
Read Also: Falcon Case : ఫాల్కన్ కేసులో ED చార్జ్ షీట్ దాఖలు.. 791 కోట్లు మోసం చేసినట్లు నిర్ధారణ
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ఇంఛార్జ్ మంత్రులకు మూడు రోజుల గడువు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలని సూచించారు. ఐతే.. ప్రస్తుతానికి బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్.. నవీన్ యాదవ్.. బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక రెడ్డి కోటాలో… సీఎన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా చర్చలో ఉన్నట్టు సమాచారం. ఐతే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచి తీరాల్సిన ఎన్నిక. దీంతో బలమైన అభ్యర్ధిని బరిలో దించాలన్న టార్గెట్ తోనే పార్టీ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ .. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలని కోరారు. మరోవైపు, బలమైన అభ్యర్ధిని బరిలో దించాలన్న లక్ష్యంతో ఏఐసీసీ కూడా అభ్యర్ధి ఎంపికపై సర్వే చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేసే సిఫార్సు.. ఏఐసీసీ చేస్తున్న సర్వే పరిశీలించిన తర్వాత ఎన్నికల్లో నిలిచే అభ్యర్ధి ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ చూస్తుంది. అయితే, ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు అవకాశం ఇచ్చారు.. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే..
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!