Site icon NTV Telugu

Metro Phase II: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIను మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Hyd Metro

Hyd Metro

Hyderabad Metro Phase II: ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయ‌న నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో 76.4 కిలోమీట‌ర్ల పొడ‌వైన మెట్రో ఫేజ్‌-II అవ‌స‌రం ఎంతో ఉంద‌ని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో క‌లిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని వివ‌రించారు. మెట్రో ఫేజ్‌-II సాకార‌మైతే న‌గ‌రంలో రాక‌పోక‌లు వేగంగా కొనసాగ‌డంతో పాటు ర‌హ‌దారుల‌పై ర‌ద్దీ కూడా త‌గ్గుతుంద‌ని వెల్లడించారు. అలాగే, సుస్థిరాభివృద్ధికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Kubera : కుబేర బడ్జెట్ ఎంత.. గట్టెక్కుతుందా..?

ఇక, పట్టణ వ్యవహారాల శాఖ సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేసి ప్రాజెక్టు డీపీఆర్ స‌మ‌ర్పించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-II ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఇప్పించాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మ‌ల్లు ర‌వి, ర‌ఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేంద‌ర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌర‌వ్ ఉప్పల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version