Gopanpally Flyover: నేడు గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
- ఐటీ కారిడార్లోని గోపన్పల్లితండా వంతెన ప్రారంభం..
- నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopanpally Flyover: రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులను కాపాడేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్లు దాదాపు అందుబాటులోకి వచ్చాయి. నగర శివారులోని ఐటీ కారిడార్లోని గోపన్పల్లితండా వంతెనను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వై ఆకారంలో నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి వెళ్లే ఐటీ ఉద్యోగులతోపాటు గోపన్ పల్లి, తెల్లాపూర్, నల్గండ్ల, కొల్లూరు వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి. గత ప్రభుత్వ హయాంలో సుమారు 28.5 కోట్ల రూపాయలతో రోడ్లు భవనాల శాఖ, పీవీ రావు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు.
Read also: TDP Parliamentary Party Meeting: నేడు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఇలా చేద్దాం..!
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ఈ వంతెన ఒక వైపు మాత్రమే వెళ్లేలా ‘Y’ ఆకారంలో నిర్మించబడింది. గోపన్పల్లి నుంచి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్కు వెళ్లే రేడియల్ రోడ్డులో తాండా జంక్షన్లో ఈ వంతెనను నిర్మించారు. గౌలిదొడ్డి వైపు నుంచి నల్గండ్ల వైపు వరకు 430 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో పాటు తేలాపూర్ వైపు 550 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మించారు. 243 మెట్రిక్ టన్నుల స్టీల్ మరియు 806 క్యూబిక్ మీటర్ల కాంక్రీటుతో 84.4 మీటర్ల సింగిల్ స్పాన్తో వంతెనను నిర్మించారు. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ ఇబ్బందులు: నల్గండ్ల, తేలాపూర్ ప్రాంతాల్లో భారీగా గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించారు. లక్షల మంది ఐటీ, ఇతర ఉద్యోగులు ఇక్కడ నివసిస్తున్నారు. నానక్రంగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్లకు వెళ్లేందుకు వేలాది కార్లు, ఇతర వాహనాలు గోపనపల్లి తండా కూడలి మీదుగా వెళ్లాలి.
Read also: CM Revanth Reddy: నేడు ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్..
అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలతో కూడలి వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ సమస్య ఐటీ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. సమయానికి ఆఫీసులకు వెళ్లలేక ఇబ్బంది పడేవారు. పాఠశాల విద్యార్థులు కూడా సతమతమయ్యేవారు. తేలాపూర్, నల్గండ్ల వైపు రెండుగా విడిపోయిన ఈ కూడలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లైఓవర్ పై, కింది భాగాలను పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వంతెనపై రాత్రిపూట అబ్బురపరిచేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
AP-TG Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు ఫుల్ వానలే..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!