CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..
- విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇకపై రూ.కోటి నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తామన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాక్ అధికారులను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు. పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు. పోలీసులు ఎవరు ఎదుట చేయి చాపకూడదన్నారు. హుందాగా గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్ శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయన్నారు.
Read also: CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
క్రిమినల్స్ తో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉండడం కాదన్నారు. బాధితులతో ఫ్రెండ్లీ గా ఉండాలి.. క్రిమినల్స్ విషయం లో పోలీసులు కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ కుటుంబాలు కోసం యంగ్ ఇండియా స్కూల్ ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు పునాది వేస్తున్నామన్నారు. వచ్చే అకాడమీ నుండి విద్యా సంస్థ ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్ అది ప్రవీణ్ జూనియర్ కమాండర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటుందని తెలిపారు.
Read also: KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..
తెలంగాణ డీజీపీ జితేందర్ మట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 214 మంది పోలీసులు అమరులు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్టం నుండి 1 పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారన్నారు. అదే ప్రవీణ్ అనే కానిస్టేబుల్ అమరుడు అయ్యాడని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహా సహకారాలు అందించిందని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల విషయం లో ఎక్కడ రాజీ పడడం లేదన్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు వాటికి కావాల్సి సౌకర్యాలు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడం లో తెలంగాణ పోలీస్ శాఖ ముందు వరుసలో ఉందని తెలిపారు.
Hyderabad Crime: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
తాజావార్తలు
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!
-
Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్