CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..
- విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇకపై రూ.కోటి నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తామన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాక్ అధికారులను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు. పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు. పోలీసులు ఎవరు ఎదుట చేయి చాపకూడదన్నారు. హుందాగా గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్ శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయన్నారు.
Read also: CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్
Also Read
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
క్రిమినల్స్ తో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉండడం కాదన్నారు. బాధితులతో ఫ్రెండ్లీ గా ఉండాలి.. క్రిమినల్స్ విషయం లో పోలీసులు కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ కుటుంబాలు కోసం యంగ్ ఇండియా స్కూల్ ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు పునాది వేస్తున్నామన్నారు. వచ్చే అకాడమీ నుండి విద్యా సంస్థ ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్ అది ప్రవీణ్ జూనియర్ కమాండర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటుందని తెలిపారు.
Read also: KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..
తెలంగాణ డీజీపీ జితేందర్ మట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 214 మంది పోలీసులు అమరులు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్టం నుండి 1 పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారన్నారు. అదే ప్రవీణ్ అనే కానిస్టేబుల్ అమరుడు అయ్యాడని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహా సహకారాలు అందించిందని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల విషయం లో ఎక్కడ రాజీ పడడం లేదన్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు వాటికి కావాల్సి సౌకర్యాలు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడం లో తెలంగాణ పోలీస్ శాఖ ముందు వరుసలో ఉందని తెలిపారు.
Hyderabad Crime: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!