CM Revanth Reddy: జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
- జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
- జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు..
CM Revanth Reddy: జమిలి ఎన్నికల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులు.. సవరణలు విషయంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సీఎం అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. సీతారాం ఏచూరి పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేదల పక్షాన తమ సహచర మిత్రపక్షమైన కాంగ్రెస్ తను ఏచూరి విబేధించారు.. నేను పీసీసీ అధ్యక్షుడ్ని అయ్యాక రెండు సార్లు కలిశానని తెలిపారు. సీతారాం ఏచూరితో మాట్లాడితే జైపాల్ రెడ్డితో మాట్లాడినట్టు ఉండేదన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వారు చాలా అరుదని తెలిపారు. నేను ఈ దేశానికి అంకితం అని చాలా మంది ఉపన్యాసాల్లో చెబుతుంటారు కానీ ఆచరణలో కాదన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలి అనుకున్నప్పుడు.. సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటన్నారు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడుతాం.. అన్నారు. రాహుల్ గాంధీకి ఏచూరికి చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. UPA-1,2 ఏర్పాటులో అనేక చట్టాలు తెచ్చినప్పుడు పేదలకు అనుకూలమైన నిర్ణయల్లో ఏచూరి పాత్ర గుర్తు చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు మాట్లాడిన మాటలపై మోడీ ఖండించలేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై అసభ్య భాష మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం ఫాసిస్ట్ విధానాలకు నిదర్శనం అని తెలిపారు.
Nagarkurnool: దవాఖానలో గుంపులుగా వీధి కుక్కలు.. భయాందోళన లో పేషెంట్లు
Also Read
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో