CM Revanth Reddy: కొత్త పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం
- తెలంగాణలో మరో పథకాన్ని ప్రారంభం..
- రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యహస్తం పథకానికి శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రిలిమ్స్కు ఎంపికైన అభ్యర్థుల కోసం ఉద్దేశించి ప్రారంభించినట్లు తెలిపారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీంతో ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యహస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.
Read also: MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. వివరాలివే..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. లబ్ధి పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) జనరల్ కేటగిరీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. అలాగే- గతంలో ఈ పథకం నుంచి ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు. అభ్యర్థులు తమ పౌర ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య దాదాపు 14 లక్షలు. సింగరేణి కాలరీస్ అంచనా ప్రకారం తెలంగాణ నుంచి ఏటా 50 వేల మంది సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుంది.
G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!