CM Revanth Reddy: కొత్త పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం
- తెలంగాణలో మరో పథకాన్ని ప్రారంభం..
- రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యహస్తం పథకానికి శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రిలిమ్స్కు ఎంపికైన అభ్యర్థుల కోసం ఉద్దేశించి ప్రారంభించినట్లు తెలిపారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీంతో ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యహస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.
Read also: MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. వివరాలివే..
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. లబ్ధి పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) జనరల్ కేటగిరీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. అలాగే- గతంలో ఈ పథకం నుంచి ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు. అభ్యర్థులు తమ పౌర ప్రయత్నంలో ఒక్కసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య దాదాపు 14 లక్షలు. సింగరేణి కాలరీస్ అంచనా ప్రకారం తెలంగాణ నుంచి ఏటా 50 వేల మంది సివిల్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుంది.
G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..