CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
- ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే- ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిధులుగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినందుకు గాను వరంగల్లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ నేతల రాకను నిర్ధారించుకున్న తర్వాతే కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని సమాచారం. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది.
Read also: BRS Dharna: నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు..
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఈడి కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. సీఎం వెంట ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన కొనసాగనుంది. అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి సెక్రెటేరియట్ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సీఎంవో అధికారులతో బ్రీఫింగ్ పై చర్చించనున్నారు.
Jogulamba Gadwal: రూ.30 లక్షలు పట్టుకుని రూ. రెండు లక్షలు చూపించారు.. పోలీసులపై వేటు..
తాజావార్తలు
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!