BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత.. మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు

  • జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత..
  • చర్చ లేకుండా బడ్జెట్ ఆమోదించడాన్ని తప్పుబడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
  • జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
  • మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు..
Ghmc

Ghmc

BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న కౌన్సిల్ మీటింగ్ లో జరిగిన దాడిపై కమిషనర్ ఇలంబరితిని కలిసి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. అయితే, సీఎం ప్రోగ్రాం కారణంగా అందుబాటులో కమిషనర్ లేకపోవడంతో.. అడిషనల్ కమిషనర్ శివ ప్రసాద్ నాయుడుకి ఫిర్యాదు పత్రం అందించారు. కమిషనర్ ఛాంబర్ నుంచి నేరుగా మేయర్ గద్వాల విజయ లక్ష్మీ ఛాంబర్ వద్దకు నినాదాలు చేస్తూ వెళ్ళిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. ఛాంబర్ లో మేయర్ లేకపోవడంతో ఛాంబర్ ముందు బైఠాయించిన కార్పొరేటర్లు.. మేయర్ కి వ్యతిరేకంగా కారు పార్టీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.

Read Also: Ashu Reddy: ఎక్స్‌పోజ్ లో సన్నిలియెన్ ను మించిపోయిన అషూరెడ్డి..

అయితే, నిన్ను జీహెచ్ఎంసీ కౌన్సిల్ నుంచి తమను సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో పాటు చర్చ లేకుండా మేయర్ గద్వాల విజయ లక్ష్మీ ఏక పక్షంగా బడ్జెట్ ఆమోదించడాన్ని వారు తప్పు పడుతున్నారు. అలాగే, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. నిన్న సభలో మహిళా కార్పొరేటర్లపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కారు పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.