BJP MP K Laxma: తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా.. కేటీఆర్ పై లక్ష్మణ్ ఫైర్..
- తెలంగాణ తల్లిగా సోనియాగాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా..
- కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడితే చేసేది ఏమీలేదు ..
- కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు మార్చారు..
- కేసీఆర్ సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి ఐనా ఉన్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxma: సోనియా గాంధీ తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లిగా సోనియాగాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా? కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడితే చేసేదేమీ లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విజయోత్సవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటున్నాడు కేటీఆర్.. పదేళ్లు మూత పడ్డ కాలేజీలు తెరిచామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి మేము అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు మార్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి ఐనా ఉన్నారా..? అని ప్రశ్నించారు.
Read also: Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?
Also Read
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
దళిత బంధు ఎంత మందికి ఇచ్చారు? అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు లాక్కుంది కేసీఆర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో భూములు లాక్కుని.. కలెక్టర్ కార్యాలయం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర,హరీష్ పర్యటన ఉందంటే హౌస్ అరెస్టు చేసే వాళ్ళు అని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థ నీ చిన్నాభిన్నం చేసింది మీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే రెచ్చగొడతారు.. పోలీసులను తిడతారు.. మళ్ళీ రివర్స్ పోలీసులనే తిడతారని మండిపడ్డారు.
Read also: Maruti Suzuki : జనవరి నుంచి భారీగా పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఇప్పుడే కొనేయండి?
ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా తీర్చీద్దబడుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విదేశీ శక్తులు కుట్రపూరితంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, రాజకీయంగా అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. విదేశీ శక్తులు ఫెక్ వార్తలతో, నిరాధార ఆరోపణలతో భారత దేశాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. OCCRP అనే ఏజెన్సీ భారత దేశంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. విదేశీ కుట్రలో కాంగ్రెస్ పావుగా మారి, అవే అంశాలను లేవెనెత్తడం, సభను జరక్కుండా చేస్తున్నారని మండిపడ్డారు.
మూడేళ్లుగా కార్యక్రమాలను జరక్కుండా అడ్డుకుంటూ ప్రజా ధనాన్ని కాంగ్రెస్ వృధా చేస్తోందని ఆరోపించారు. OCCRP వార్త రాయడం, వెంటనే కాంగ్రెస్ అందుకోవడం కామన్ అయిపోయిందన్నారు. భారత్ లో అగ్రశేణి పారిశ్రామిక వేత్తలను లక్ష్యం చేసుకుని.. పెట్టుబడి దారులను దెబ్బతీయడం.. నిరాధార ఆరోపణలతో ఉసిగొలుపుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి వ్యతిరేఖంగా వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్, కాంగ్రెస్ లు ఆందోళనలు చేయడం పరిపాటి అయిపోయిందని అన్నారు.
Read also: OPPO Find X8 Price: ‘ఒప్పో ఫైండ్ ఎక్స్8’ సేల్స్ ఆరంభం.. ప్లిప్కార్ట్లో 7 వేల తగ్గింపు!
నరేంద్ర మోడీని, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. భారత దేశం పట్ల విషం చిమ్ముతున్నారని తెలిపారు. శరీరాలు వేరయినా OCCRP, రాహుల్ ఒకేలా వ్యవహరిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 6 అబద్ధాలు, 66 మోసాలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు.
Read also: Minor Girls Missing: జగిత్యాలలో మైనర్ బాలిక మిస్సింగ్ .. 24 గంటలు అయినా దొరకని ఆచూకీ
ఫేక్ వీడియో సృష్టించి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు.. హైదారాబాద్ లో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. రాజ్యసభలో అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందని ప్రచారం చేశారని అన్నారు. కానీ, ఈవీ సీటు వద్ద డబ్బులు దొరికాయని చైర్మన్ స్పష్టం చేశారన్నారు. నోట్ల కట్ట ఎవరిది అనేది విచారణ జరిగితేనే వాస్తవం బయటకు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఈ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
Jagtial: ఒకే గదిలో ఐదు తరగతులు.. ఇబ్బందుల్లో విద్యార్థులు
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!