Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు.. భట్టి విక్రమార్క కౌంటర్..
- ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి మల్లు భట్టి విక్రమార్క కౌంటర్..
- దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచింది..
- 18 వేల కోట్ల రుణమాఫీ ఒకే రోజు చేసిన ఘనత కాంగ్రెస్ దే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ స్థాయిలో భారత్ నిలబడడంలో ఇంధిరా గాంధీ పాత్ర కీలకం అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచిందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి బట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులు ఎత్తి నమస్కరిస్తారన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీని నెగిటివ్ గా చూపిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..
Also Read
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
దేశ చరిత్రపై అవగాహన లేని వాళ్ళు కావాలని సినిమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవాళ్లు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాలు అందించారని తెలిపారు. కాళేశ్వరంతో పంట దిగుబడి పెరగలేదన్నారు. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే దిగుబడి పెరిగిందన్నారు. మేడిగడ్డ..అన్నారం..సుందిళ్ళలో నీల్లే లేవు.. కిందికి వదిలేస్తున్నామన్నారు. కానీ ఈ సారి కూడా వరి దిగుబడి పెరిగిందన్నారు. బీఆర్ఎస్ చెప్పిన దానికి.. వాస్తవానికి తేడా ఉందన్నారు. ధరణి నీ సెట్ చేస్తున్నామన్నారు. రైతులకు ఉన్న ఇబ్బందులు తొలగిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షపాతి అన్నారు. 18 వేల కోట్ల రుణమాఫీ ఒకే రోజు చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. పార్టీ నాయకులు జనంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
TG Weather: పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!