Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు.. భట్టి విక్రమార్క కౌంటర్..
- ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి మల్లు భట్టి విక్రమార్క కౌంటర్..
- దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచింది..
- 18 వేల కోట్ల రుణమాఫీ ఒకే రోజు చేసిన ఘనత కాంగ్రెస్ దే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ స్థాయిలో భారత్ నిలబడడంలో ఇంధిరా గాంధీ పాత్ర కీలకం అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచిందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి బట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులు ఎత్తి నమస్కరిస్తారన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీని నెగిటివ్ గా చూపిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..
Also Read
- Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
దేశ చరిత్రపై అవగాహన లేని వాళ్ళు కావాలని సినిమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవాళ్లు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాలు అందించారని తెలిపారు. కాళేశ్వరంతో పంట దిగుబడి పెరగలేదన్నారు. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే దిగుబడి పెరిగిందన్నారు. మేడిగడ్డ..అన్నారం..సుందిళ్ళలో నీల్లే లేవు.. కిందికి వదిలేస్తున్నామన్నారు. కానీ ఈ సారి కూడా వరి దిగుబడి పెరిగిందన్నారు. బీఆర్ఎస్ చెప్పిన దానికి.. వాస్తవానికి తేడా ఉందన్నారు. ధరణి నీ సెట్ చేస్తున్నామన్నారు. రైతులకు ఉన్న ఇబ్బందులు తొలగిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షపాతి అన్నారు. 18 వేల కోట్ల రుణమాఫీ ఒకే రోజు చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. పార్టీ నాయకులు జనంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
TG Weather: పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..
తాజావార్తలు
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
-
Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
-
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
-
Memu Kapulam: ‘మేము కాపులం’ టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!