Hyderabad: స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి..

Untitled 6

Untitled 6

Hyderabad: నగరంలో గత కొంత కాలంగా స్కూల్ బస్సు కింద పడి చిన్నారులు మృతి చెందిన వార్తలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో హయత్ నగర్ లో ఓ మూడేళ్ళ చిన్నారి అక్కను బస్సు ఎక్కించడానికి తాతయ్య తో కలిసి వచ్చి బస్సు కింద పడి మరణించారు. ఆ ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన 3 ఏళ్ళ చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో చోటు చేసుకుంది, విబువారాలోకి వెళ్తే.. భవిష్య అనే 3 ఏళ్ళ చిన్నారి కుటుంబం హైదరాబాద్ లోని జవహర్ నగర్ ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనిలో నివాసం ఉంటుంది.

Read also:Minister Adimulapu Suresh: నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమే..

×
×
Ad

కాగా భవిష్య సోదరుడు రచన గ్రామర్ హైస్కూల్ లో చదువుతున్నాడు. కాగా ప్రతి రోజు లానే స్కూల్ కి వెళ్లేందుకు స్కూల్ బస్సు దగ్గరకి వస్తున్న సోదరుడితో కలిసి బస్సు దగ్గరకి వచ్చింది భవిష్య. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది భవిష్య. దీనితో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు కారణం బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే అని స్థానికులు భావిస్తున్నారు. కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.