సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. వెయిటింగ్ హాలులో అనుమానంగా సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయి మోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా రవాణా చేస్తోంది. ఈ ముఠాలో ఒడిశాకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు ఉన్నారు. నిందితుల నుంచి 16 లక్షల రూపాయలు విలువ చేసే 54 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: ఆగని బాదుడు.. ఈరోజు కూడా పెరిగిన పెట్రోల్ ధర
నిందితులు ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ మీదుగా మోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయిని ముంబైకి రవాణా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ముంబై నుంచి వస్తున్న రిసీవర్స్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశామన్నారు. ఆరుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, ఈ గంజాయి ముఠాపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినా, విక్రయించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.