Weather Alert : హైదరాబాద్ను కుమ్మేస్తున్నక్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో
- క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో కుంభవృష్టి – లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తం
- అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచిన అధికారులు
- ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మార్పుకు ప్రధాన కారణం క్యుములోనింబస్ మేఘాలు అని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ రాత్రి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు పగలు వేడి వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మేఘాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేవారు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అసాధారణంగా తక్కువ సమయంలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ఆదేశాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన చోట వెంటనే స్పందించాలని తెలిపారు. అలాగే, మ్యాన్హోల్స్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
Illegal Liquor: తెలివి మీరిన కేటుగాళ్లు.. భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు బట్టబయలు!
తాజావార్తలు
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
-
Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
-
Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..