Weather Alert : హైదరాబాద్ను కుమ్మేస్తున్నక్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో
- క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో కుంభవృష్టి – లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తం
- అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచిన అధికారులు
- ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మార్పుకు ప్రధాన కారణం క్యుములోనింబస్ మేఘాలు అని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ రాత్రి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు పగలు వేడి వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మేఘాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేవారు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అసాధారణంగా తక్కువ సమయంలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ఆదేశాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన చోట వెంటనే స్పందించాలని తెలిపారు. అలాగే, మ్యాన్హోల్స్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
Illegal Liquor: తెలివి మీరిన కేటుగాళ్లు.. భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు బట్టబయలు!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!