Weather Alert : హైదరాబాద్ను కుమ్మేస్తున్నక్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో
- క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో కుంభవృష్టి – లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తం
- అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచిన అధికారులు
- ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Alert : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మార్పుకు ప్రధాన కారణం క్యుములోనింబస్ మేఘాలు అని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ రాత్రి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు పగలు వేడి వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మేఘాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేవారు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అసాధారణంగా తక్కువ సమయంలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ఆదేశాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన చోట వెంటనే స్పందించాలని తెలిపారు. అలాగే, మ్యాన్హోల్స్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
Illegal Liquor: తెలివి మీరిన కేటుగాళ్లు.. భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు బట్టబయలు!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!