Hyderabad Water Board : ఈ ఏరియాల్లో మూడురోజులపాటు నీటి సరఫరా బంద్
- గోదావరి వాటర్ ప్రాజెక్ట్ పనుల వల్ల మూడురోజుల నీటి సమస్య
- 22 డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోనుంది
- నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం
- ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Water Board : హైదరాబాద్ జలమండలి ఈనెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 900 మిల్లీమీటర్ల వ్యాసం గల వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్న కారణంగా ఈ సమస్య తలెత్తనుంది. అదనంగా, ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు కూడా జరుగనున్నాయి.
Lunar Eclipse: కొద్దిసేపట్లో చంద్రగ్రహణం.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే..
Also Read
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
ప్రభావిత ప్రాంతాలు
డివిజన్ 6: ఎస్.ఆర్.నగర్, సనత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమజిగూడ, ఫతేనగర్, జూబ్లీహిల్స్ మరియు పరిసరాలు
డివిజన్ 7: లాలాపేట్, తార్నాకా కొంత భాగం
డివిజన్ 9: కుకట్పల్లి, భాగ్యనగర్, మోతీనగర్, కెపిహెచ్బి, బాలాజీనగర్
డివిజన్ 12: చింతల్, సుచిత్ర, షాపూర్నగర్, సూరారం, గజులరామారం, జగద్గిరిగుట్ట
డివిజన్ 8: అల్వాల్, మాచ్చబోలారం, యాప్రాల్, గౌతమ్నగర్, మౌలాలి రిజర్వాయర్ పరిసరాలు
డివిజన్ 14 (కాప్రా): చర్లపల్లి, రాధికా, కైలాసగిరి, మల్లాపూర్
డివిజన్ 15: కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల కొంతభాగం
డివిజన్ 17: హఫీజ్పేట్, మియాపూర్
డివిజన్ 19: పొచారం
డివిజన్ 21: కొంపల్లి, జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, అయ్యప్పకాలనీ
డివిజన్ 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, బోల్లారం, తెల్లాపూర్
అదనంగా, ట్రాన్స్మిషన్-4 కింద హకీంపేట్ ఎయిర్ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, AIIMS బిబినగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ప్రభావితం కానుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మెడ్చల్/శామీర్పేట్) ప్రాంతాలు ప్రభావితమవనున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల ప్రజలు తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
-
Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
-
Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
-
Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
-
Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!