Hyderabad Water Board : ఈ ఏరియాల్లో మూడురోజులపాటు నీటి సరఫరా బంద్
- గోదావరి వాటర్ ప్రాజెక్ట్ పనుల వల్ల మూడురోజుల నీటి సమస్య
- 22 డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోనుంది
- నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం
- ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Water Board : హైదరాబాద్ జలమండలి ఈనెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 900 మిల్లీమీటర్ల వ్యాసం గల వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్న కారణంగా ఈ సమస్య తలెత్తనుంది. అదనంగా, ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు కూడా జరుగనున్నాయి.
Lunar Eclipse: కొద్దిసేపట్లో చంద్రగ్రహణం.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ప్రభావిత ప్రాంతాలు
డివిజన్ 6: ఎస్.ఆర్.నగర్, సనత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమజిగూడ, ఫతేనగర్, జూబ్లీహిల్స్ మరియు పరిసరాలు
డివిజన్ 7: లాలాపేట్, తార్నాకా కొంత భాగం
డివిజన్ 9: కుకట్పల్లి, భాగ్యనగర్, మోతీనగర్, కెపిహెచ్బి, బాలాజీనగర్
డివిజన్ 12: చింతల్, సుచిత్ర, షాపూర్నగర్, సూరారం, గజులరామారం, జగద్గిరిగుట్ట
డివిజన్ 8: అల్వాల్, మాచ్చబోలారం, యాప్రాల్, గౌతమ్నగర్, మౌలాలి రిజర్వాయర్ పరిసరాలు
డివిజన్ 14 (కాప్రా): చర్లపల్లి, రాధికా, కైలాసగిరి, మల్లాపూర్
డివిజన్ 15: కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల కొంతభాగం
డివిజన్ 17: హఫీజ్పేట్, మియాపూర్
డివిజన్ 19: పొచారం
డివిజన్ 21: కొంపల్లి, జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, అయ్యప్పకాలనీ
డివిజన్ 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, బోల్లారం, తెల్లాపూర్
అదనంగా, ట్రాన్స్మిషన్-4 కింద హకీంపేట్ ఎయిర్ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, AIIMS బిబినగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ప్రభావితం కానుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మెడ్చల్/శామీర్పేట్) ప్రాంతాలు ప్రభావితమవనున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల ప్రజలు తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!