Hyderabad Water Board : ఈ ఏరియాల్లో మూడురోజులపాటు నీటి సరఫరా బంద్
- గోదావరి వాటర్ ప్రాజెక్ట్ పనుల వల్ల మూడురోజుల నీటి సమస్య
- 22 డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోనుంది
- నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం
- ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి
Hyderabad Water Board : హైదరాబాద్ జలమండలి ఈనెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 900 మిల్లీమీటర్ల వ్యాసం గల వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్న కారణంగా ఈ సమస్య తలెత్తనుంది. అదనంగా, ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు కూడా జరుగనున్నాయి.
Lunar Eclipse: కొద్దిసేపట్లో చంద్రగ్రహణం.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే..
Also Read
- Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
- Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
ప్రభావిత ప్రాంతాలు
డివిజన్ 6: ఎస్.ఆర్.నగర్, సనత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమజిగూడ, ఫతేనగర్, జూబ్లీహిల్స్ మరియు పరిసరాలు
డివిజన్ 7: లాలాపేట్, తార్నాకా కొంత భాగం
డివిజన్ 9: కుకట్పల్లి, భాగ్యనగర్, మోతీనగర్, కెపిహెచ్బి, బాలాజీనగర్
డివిజన్ 12: చింతల్, సుచిత్ర, షాపూర్నగర్, సూరారం, గజులరామారం, జగద్గిరిగుట్ట
డివిజన్ 8: అల్వాల్, మాచ్చబోలారం, యాప్రాల్, గౌతమ్నగర్, మౌలాలి రిజర్వాయర్ పరిసరాలు
డివిజన్ 14 (కాప్రా): చర్లపల్లి, రాధికా, కైలాసగిరి, మల్లాపూర్
డివిజన్ 15: కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల కొంతభాగం
డివిజన్ 17: హఫీజ్పేట్, మియాపూర్
డివిజన్ 19: పొచారం
డివిజన్ 21: కొంపల్లి, జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, అయ్యప్పకాలనీ
డివిజన్ 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, బోల్లారం, తెల్లాపూర్
అదనంగా, ట్రాన్స్మిషన్-4 కింద హకీంపేట్ ఎయిర్ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, AIIMS బిబినగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ప్రభావితం కానుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మెడ్చల్/శామీర్పేట్) ప్రాంతాలు ప్రభావితమవనున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల ప్రజలు తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!