Tequila Pub: టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి.. అదుపులో 18 మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని రాంగోపాల్పేట్లోని తకీల పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అర్ధరాత్రి వరకు అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో.. పోలీసులు దాడి చేశామని అన్నారు. పబ్ లోని 18 మందిని అదుపులో తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. పబ్ లో అనుమతి లేకుండా యువతులతో నృత్యాలు చేయిస్తున్నారని అన్నారు. 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. తకీల పబ్ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. ఏప్రిల్ 17 న ( ఆదివారం) తెల్లవారుజామున పుడింగ్ పబ్ లో పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో 150మందికిపైగా పట్టుబడ్డారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లులు కూడా ఉన్నారు. ఈ వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
Also Read
పబ్లో 4.6 గ్రాముల కొకైన్ లభించడంతో పబ్ యజమాని అభిషేక్తో పాటు, మేనేజర్ అనిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ కు ఊరట దొరికింది. ఇలా పబ్ లపై రైడ్స్ జరగటం.. మళ్ళీ 18 మందిని అరెస్ట్ చేయటంతో పబ్ ల విషయం నగరంలో చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!