High Temperature: రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Temperature: తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, ఖమ్మం జిల్లా మధిర, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 38.9 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. నేటి నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read also: AP High Court: హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి.. ఏపీ హైకోర్టులో పిల్!
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని.. ఎండ నుంచి రక్షణ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని యానాంలో దిగువ ట్రోపో ప్రాంతంలో ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయని చెప్పారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రలోనూ పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక స్టీల్ కాస్టింగ్ ప్రారంభం కావడంతో కూలర్లు, ఏసీల మరమ్మత్తు చేసుకునేందుకు ప్రజలు బిజీ అయ్యారు. అలాగే చల్లటి నీటి కోసం వాటర్ కూలర్లు, ఫ్రిజ్ లను కొనుగోలు చేస్తున్నారు.
AP High Court: హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి.. ఏపీ హైకోర్టులో పిల్!
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!