Fake Baba: పాతబస్తీలో దారుణం.. నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba: పాతబస్తీలో చికిత్స నెపంతో నవ వధువుపై కపట బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తలాబ్ కట్టా నివాసి హాజీతో మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే వధువు ఆరోగ్యం కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించింది. బాలిక ఆరోగ్యం విషమించడంతో అత్తమామలు ఆమెను బండ్ల గూడా ప్రాంతంలో నివసించే మజార్ బాబా వద్దకు తీసుకెళ్లారు. వధువు శరీరంపై ఐదు దయ్యాలు ఉన్నాయని అది వదిలించాలని లేదంటే ప్రమాదమని వధువు అత్త మామలకు నమ్మించాడు. దీంతో వారు భయపడి దయ్యాలను వదిలించాలని కోరారు. అయితే ఇదే అలుసుగా భావించిన నకిలీ బాబా అత్త మామలకు బయటనే ఉండమని చెప్పి నవ వధువును తీసుకుని ఓ గదిలో తీసుకుని వెళ్లాడు. ఆమెకు భయపడాల్సిన అవసరం లేదని ఏం జరిగినా అరవకూడదని చెప్పి వధువు కళ్లకు గంతలు కట్టి అనంతరం దొంగ బాబా బాలికపై అత్యాచారం చేశాడు. ఏమీ తెలియనట్లు దయ్యాలు వదిలించానని నమ్మించాడు. అత్తమామలు వధువును తీసుకుని ఇంటికి వచ్చారు.
Read also: Bunny: ఏకంగా ఇన్స్టాగ్రామ్ దిగొచ్చింది.. దేశంలోనే మొదటి హీరో… ఇది బ్రాండ్ అంటే
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మానసిక ఆవేదనకు గురైన వధువు ఇంటికి వచ్చి తన భర్తకు, అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో10 బంధించారు. విషయం తెలుసుకున్న తల్లి.. కూతురు అత్తవారింటికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చించి. ఏం జరిగిందని వధువును అడగడంతో విషయం అంతా చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే భవానినగర్ పోలీసులకు అత్యాచారం విషయంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి క్రైమ్ నం.0/2023లో సెక్షన్ 354BIPC(1)376 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు ఎందుకు చేయలేదని బాధితులు ప్రశ్నించగా .. కేసును బండ్లగూడ బదిలీ చేసినట్లు భవానీ నగర్ పోలీసులు చెప్పారు. అయితే ఫైల్ ఇంకా రాలేదని బండ్లగూడ పోలీసులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా మజార్ బాబాపై అత్యాచారం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో బాలికను ఉరి తీస్తామని అత్తమామలు బెదిరించి నట్లు తెలిసింది. నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారని ఇన్స్పెక్టర్ బండ్ల గూడ ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపారు. ఒకవైపు పోలీసులు బాధితులను ఆదుకోవడం లేదని, ఇంకోవైపు అత్తమామలు బెదిరిస్తున్నారని బాలిక, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Prema Deshapu Yuvarani: ‘ప్రేమదేశపు యువరాణి’ కోసం సునీత పాడిన సాంగ్ రిలీజ్
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!