Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
- రూ.15 వేల కోట్లతో మెట్రోపై ప్రభుత్వ పట్టు
- IRFC రుణంతో భారీ ఆర్థిక వ్యవహారం
- కొత్త బోర్డ్ నియామకం.. పరిపాలనలో మార్పులు
- విస్తరణ, ఛార్జీలపై ప్రభుత్వానికి పూర్తి అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక భారీ మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను సుమారు రూ. 15 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముగించింది. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ఈ కీలకమైన స్వాధీన ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి కానుంది, దీంతో మెట్రో రైలు మెజార్టీ వాటాదారుగా ప్రభుత్వం మారి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది.
Also Read
ఈ భారీ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రూ. 13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గ్యారంటీ పత్రాలు, అండర్టేకింగ్ లెటర్లపై సంతకాలు చేసే అధికారాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం కట్టబెట్టింది. అలాగే, మెట్రో కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు ప్రస్తుత సిబ్బంది నియామకాలు, ఇతర సాంకేతిక ఒప్పందాలపై ఎల్ అండ్ టీతో చర్చలు జరిపి సంతకాలు చేసే బాధ్యతను హెచ్ఎమ్మార్ఎల్ (HMRL) ఎండీకి అప్పగించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించింది.
మెట్రో నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో పరిపాలన పరంగా కూడా కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావును మెట్రో చైర్మన్గా నియమించగా, సర్ఫరాజ్ అహ్మద్ను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. వీరితో పాటు మరికొంత మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డైరెక్టర్లుగా బోర్డులోకి తీసుకువచ్చింది. ఈ మార్పుల ద్వారా మెట్రో నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు, భవిష్యత్తులో మెట్రో విస్తరణ , ఛార్జీల నియంత్రణ నేరుగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండనుంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!