Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
- రూ.15 వేల కోట్లతో మెట్రోపై ప్రభుత్వ పట్టు
- IRFC రుణంతో భారీ ఆర్థిక వ్యవహారం
- కొత్త బోర్డ్ నియామకం.. పరిపాలనలో మార్పులు
- విస్తరణ, ఛార్జీలపై ప్రభుత్వానికి పూర్తి అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక భారీ మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను సుమారు రూ. 15 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముగించింది. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ఈ కీలకమైన స్వాధీన ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి కానుంది, దీంతో మెట్రో రైలు మెజార్టీ వాటాదారుగా ప్రభుత్వం మారి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది.
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
ఈ భారీ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రూ. 13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గ్యారంటీ పత్రాలు, అండర్టేకింగ్ లెటర్లపై సంతకాలు చేసే అధికారాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం కట్టబెట్టింది. అలాగే, మెట్రో కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు ప్రస్తుత సిబ్బంది నియామకాలు, ఇతర సాంకేతిక ఒప్పందాలపై ఎల్ అండ్ టీతో చర్చలు జరిపి సంతకాలు చేసే బాధ్యతను హెచ్ఎమ్మార్ఎల్ (HMRL) ఎండీకి అప్పగించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించింది.
మెట్రో నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో పరిపాలన పరంగా కూడా కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావును మెట్రో చైర్మన్గా నియమించగా, సర్ఫరాజ్ అహ్మద్ను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. వీరితో పాటు మరికొంత మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డైరెక్టర్లుగా బోర్డులోకి తీసుకువచ్చింది. ఈ మార్పుల ద్వారా మెట్రో నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు, భవిష్యత్తులో మెట్రో విస్తరణ , ఛార్జీల నియంత్రణ నేరుగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండనుంది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!