Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
- రూ.15 వేల కోట్లతో మెట్రోపై ప్రభుత్వ పట్టు
- IRFC రుణంతో భారీ ఆర్థిక వ్యవహారం
- కొత్త బోర్డ్ నియామకం.. పరిపాలనలో మార్పులు
- విస్తరణ, ఛార్జీలపై ప్రభుత్వానికి పూర్తి అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక భారీ మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను సుమారు రూ. 15 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముగించింది. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ఈ కీలకమైన స్వాధీన ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి కానుంది, దీంతో మెట్రో రైలు మెజార్టీ వాటాదారుగా ప్రభుత్వం మారి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఈ భారీ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రూ. 13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గ్యారంటీ పత్రాలు, అండర్టేకింగ్ లెటర్లపై సంతకాలు చేసే అధికారాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం కట్టబెట్టింది. అలాగే, మెట్రో కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు ప్రస్తుత సిబ్బంది నియామకాలు, ఇతర సాంకేతిక ఒప్పందాలపై ఎల్ అండ్ టీతో చర్చలు జరిపి సంతకాలు చేసే బాధ్యతను హెచ్ఎమ్మార్ఎల్ (HMRL) ఎండీకి అప్పగించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించింది.
మెట్రో నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో పరిపాలన పరంగా కూడా కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావును మెట్రో చైర్మన్గా నియమించగా, సర్ఫరాజ్ అహ్మద్ను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. వీరితో పాటు మరికొంత మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డైరెక్టర్లుగా బోర్డులోకి తీసుకువచ్చింది. ఈ మార్పుల ద్వారా మెట్రో నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు, భవిష్యత్తులో మెట్రో విస్తరణ , ఛార్జీల నియంత్రణ నేరుగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండనుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!