Telangana Floods : నిండుకుండల్లా జంట జలాశయాలు.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్..
- జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి చేరిక
- హిమాయత్ సాగర్ నుంచి 2,300 క్యూసెక్కుల నీటి విడుదల
- ఉస్మాన్ సాగర్ నుంచి 2,106 క్యూసెక్కుల నీరు మూసీలోకి
- పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Floods : నిన్నటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జంట జలాశయాలను నిండుకుండలా మార్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. చేవెళ్ల, వికారాబాద్, మొయినాబాద్, మోమిన్పేట, చిలుకూరు వంటి మండలాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జలాశయాలకు గణనీయంగా ఇన్ఫ్లో పెరిగింది. హిమాయత్ సాగర్కు ప్రస్తుతం సుమారు 2,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మూడు గేట్లు ఎత్తి, 2,300 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఉస్మాన్ సాగర్లోనూ భారీగా నీరు చేరుతోంది. ఈ జలాశయానికి సుమారు 1,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 2,106 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Siricilla : జలాశయంలో చిక్కుకున్న వారిని కాపాడిన రెస్కూ టీం
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నది. ఈ క్రమంలో అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునేలా సూచనలు చేస్తున్నారు. వరదనీటి విడుదల కారణంగా తక్కువ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు. ఇక జంట జలాశయాల్లో వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి ఇంకా రెండు రోజుల పాటు కురిసే వర్షాలపై ఆధారపడి ఉండనుంది. వర్షాల తీవ్రత అలాగే ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాల పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ, నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. వరద నీటిని సురక్షితంగా వదులుతూ, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం.. మూడేళ్ల యుద్ధంలో రెండో అతిపెద్ద దాడి
తాజావార్తలు
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!