Hyderabad: హుస్సేన్ సాగర్ లో పేరకు పోయిన వ్యర్థాలు ఎంతంటే..?
- వినాయక చవతి వేడుకల్లో భాగంగా..భారీగా పేరకు పోయిన చెత్త
- రంగంలోకి దిగి శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు
- చెత్తను తరలించేందుకు 700 వాహనాలను ఉపయోగించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. ఇదంతా బాగానే ఉన్నప్పట్టికి.. విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. దాదాపు కొన్ని వేల విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాలతో పాటు 32 వేల టన్నుల చెత్త, వ్యర్థాలు పేరుకు పోయాయని అధికారులు వెల్లడించారు.
రోడ్లపై చెత్తను, ‘సాగర్’లో వ్యర్థాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ఉత్సవాలు జరిగిన11 రోజులపాటు గ్రేటర్రోడ్లపై భక్తులు 20 వేల టన్నులకు పైగా చెత్త వేశారని అధికారులు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఒక్కరోజులోనే 4 వేల టన్నుల చెత్త బయటపడిందన్నారు. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించామన్నారు జీహెచ్ఎంసీ అధికారు..
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించేందుకు 700 వాహనాలను వినియోగించామన్నారు. నిమజ్జనం జరిగిన ప్రాంతాల్లో పేపర్ షాట్లను తొలగించేందుకు ప్రైవేటుకు చెందిన ఒక జటాయ్ యంత్రాన్ని వాడామన్నారు. రోడ్డుపై నుంచి నేరుగా మెషీన్లోపలకు చెత్తను తీసుకోవడమే దీని ప్రత్యేకత. మిగతా ప్రాంతాల్లో పేపర్ షాట్ల తొలగింపునకు శానిటేషన్ కార్మికులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. తిఏటా నిమజ్జనం చివరి రెండు రోజుల్లోనే ఎక్కువగా చెత్త, వ్యర్థాలు వస్తుండడంతో ఈ ఆదివారం, సోమవారం జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సోమవారం సాయంత్రానికి పూర్తిగా వ్యర్థాలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Gulab Jamun Paratha Recipe: ఎప్పుడైనా ‘గులాబ్ జామ్ పరాఠా’ రుచి చూశారా..? పిల్లలు ఇష్టంగా తినే స్పెషల్ రెసిపీ..
-
Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
-
Wedding Drama: వరమాల వేసే టైమ్లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్చేస్తే..
-
Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
-
Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..