Hyderabad Food : ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్.. కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్
- సిటీలో ఫుడ్స్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే
- సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడి
- 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్లో హైదరాబాద్
- గడిచిన రెండు నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం..
Hyderabad Food : బిర్యానీ అంటే హైదరాబాద్… హైదరాబాద్ అంటే బిర్యానీ అని చెప్పడం అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు దాదాపు లేరనే చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. అయితే.. ఈ క్రమంలోనే.. విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడి ఫుడ్ను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో ఫుడ్ క్వాలిటీ పరంగా అనేక స్టార్ రేటింగ్స్ను హైదరాబాద్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీ కోసం దేశంలోని ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చినవారే కాదు, విదేశీయులు కూడా ఇష్టంగా తింటూ కొనియాడుతుంటారు. అంతే కాదు, ఇక్కడి బిర్యానీ నిత్యం వేలాది పార్శిల్స్ రూపంలో ఇతర దేశాలకు వెళ్లడం సాధారణం. కానీ ఇప్పుడు పరిస్థితి ఆహార భద్రతపరంగా ఆందోళనకరంగా మారింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినడం ప్రమాదకరమైపోయినట్లు తెలుస్తోంది.
Bandi Sanjay : విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
తాజాగా జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో చీకటి నిజాలు వెలుగుచూశాయి. అక్కడ కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా చేసిన సర్వే మరింత సంచలనం రేపింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానానికి పడిపోయింది. నగరంలోని 62 శాతం హోటళ్లు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని సర్వే పేర్కొంది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం నిలిచింది. బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అయితే.. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో.. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!