Site icon NTV Telugu

ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హుస్సేన్ సాగర్…

ఆత్మహత్య లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హుస్సేన్ సాగర్. నిన్ను ఒక్కరోజే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఐదుగురు మహిళలు. అయితే ఆ ఐదుగురిని లేక్‌ పోలీసులు కాపాడారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో గొడవలు, ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్యా యత్నంకి పాల్పడ్డారు మహిళలు. కానీ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కు అప్పగించారు పోలీసులు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 285 మందిని కాపాడిన లేక్‌ పోలీస్ లు కోవిడ్ తరువాత ఆత్మహత్యలు పెరిగాయంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య లు చేసుకోవడానికి వస్తున్నారంటున్న లేక్ పోలీసులు కోవిడ్, లాక్ డౌన్ సమయంలో వంద మందిని రక్షించారు.

Exit mobile version