Hyderabad High Alert: బెంగుళూరులో పేలుళ్లు.. హైదరాబాద్ లో హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad High Alert: బెంగళూరులోని హోటల్ రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్లో నగర పోలీసులు హైఅలర్ట్ ఏర్పాటు చేశారు. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తదితర పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు మాల్స్లో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దిల్ షుక్ నగరంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను తనిఖీ చేస్తూ.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తనిఖీ చేసిన తర్వాతే అందరినీ అనుమతిస్తున్నారు. బెంగళూరులోని జరిగిన ఘటన హైదరాబాద్ కోఠిలోని గోకుల్ ఛాట్ బాంబ్ బ్లాస్ట్ ను తలపించేలా జరిగింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Read also: Stock Market : రికార్డులను బద్దలు కొట్టిన స్టాక్ మార్కెట్.. ఆరు గంటల్లో రూ.4.16 లక్షల కోట్లు
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
నిన్న మధ్యాహ్నం మేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి బ్యాగ్ని రెస్టారెంట్లో వదిలేశాడు. అందులోని బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ధృవీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘోర పేలుడు దృశ్యాలు కేఫ్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు భోజనం చేస్తున్న సమయంలో దుండగుడు బాంబును అమర్చినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు రావడంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. చాలా మంది భయంతో బయటకు పరుగులు తీశారు. గాయపడిన వ్యక్తులు నేలపై పడి ఉన్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది గాయపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని సీఎం తెలిపారు. మరోవైపు ఈ కేసును ఎన్ఐఏ విచారించే అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కేఫ్ పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు.
TS Inter Exams 2024: నో టెన్షన్.. నిమిషం నిబంధన తొలగించిన ఇంటర్ బోర్డు
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..