Nizamabad: జిల్లాలో కుండపోత వర్షం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కి పోటెత్తిన వరద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. మెండోరాలో రికార్డ్ స్థాయిలో 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదో రోజు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 10 వేల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు.. కప్పుల వాగు కారణంగా భీంగల్- సిరికొండ మధ్య, అలాగే భీంగల్- మోర్తాడ్, భీంగల్-వేల్పూర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచాయి.
అటు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. 2 లక్షల 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 1 లక్షా 50 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నీటి మట్టం 1091 అడుగులు ఉండగా.. 1087 అడుగులకు నీళ్లు చేరాయి. ఈ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. 73 టీఎంసీలు నీళ్లు చేరినట్టు తేలింది. ఇప్పటివరకు అధికారులు 30 వరద గేట్లను ఎత్తేశారు. ఇలా గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ వద్దనున్న జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లను ఉపయోగిస్తూ.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మూడు యూనిట్ల ద్వారా 25 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్పోర్ట్ సరఫరా చేస్తున్నారు.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.