Site icon NTV Telugu

Harish Rao: టెట్‌ ఫీజులు తగ్గించకపోతే పోరాటం చేస్తాం.. సీఎంకు హరీష్‌ రావు లేఖ

Harish Rao Revanth Reddy

Harish Rao Revanth Reddy

Harish Rao: టెట్ ఫీజులు తగ్గించాలి లేకుంటే నిరుద్యోగుల తరుపున పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గురించి లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే అని మండిపడ్డారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్నారు.

Read also: Hyderabad to Ayodhya: హైదరాబాద్‌ టూ అయోధ్యకు ఫ్లైట్‌.. ఎప్పటి నుంచి అంటే..

దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, టెట్ ఒక పేపర్‌ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫీజులు సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్ గా ఉండటం గమనార్హం. రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు.

Read also: Telangana: దంచికొడుతున్న ఎండలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నది. మన రాష్ట్రంలో ఎపిసెట్‌, ఐసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నారు. కానీ టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించక పోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్‌ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారని అన్నారు.

Read also: Nizamsagar: తెగిన నిజాంసాగర్‌ కెనాల్‌ కట్ట.. పరుగులు తీసిన కాలనీవాసులు..!

పుస్తకాలు వదిలి రోడ్డకెక్కి ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్‌ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరించారు.
SRH vs CSK Tickets 2024: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-చెన్నై మ్యాచ్.. నకిలీ టిక్కెట్ల హల్‌చల్! బీ అలెర్ట్

Exit mobile version