మాజీ మంత్రి ఈటల రాజేందర్పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్చాట్లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం కాదు-ఆస్తులు రక్షణ కోసమే బీజేపీలోకి వెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల ఓడిపోవడం ఖాయం.. ఆయన్ని ఆ దేవుడు కూడా గెలిపించలేరు అని జోస్యం చెప్పారు.. మరో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన గుత్తా.. 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని.. నియోజకవర్గల డి- లిమిటేషన్ 2026లో పూర్తిఅవుతుందని తెలిపారు.