Revanth Reddy: గవర్నర్, ప్రభుత్వం ఒక్కటే.. అదంతా డ్రామా మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor State Government Playing Dramas Says Revanth Reddy: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన రోజు గవర్నర్, ప్రభుత్వం ఒక్కటి అవుతున్నారని.. మిగిలిన రోజుల్లో డ్రామా రక్తి కట్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అవగాహనతోనే రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూములపై ఎంతోమంది దాడులు చేస్తే.. గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిందన్నారు. సెక్షన్ 8 ప్రకారం.. గవర్నర్ పరిధిలో అన్ని ఉన్నాయని, అందరు అధికారులను పిలిచి మాట్లాడవచ్చని తెలిపారు. సమీక్ష చేసి సస్పెండ్ కూడా చేయొచ్చన్నారు. Doptకి రికమెంట్ చేస్తే చాలని, CS మీద కూడా చర్చలు తీసుకోవచ్చని అన్నారు. సెక్షన్ 8 గురించి గవర్నర్కి తెలియకపోతే.. తమకు అపాయింట్మెంట్ ఇస్తే, వెళ్లి చెప్తామన్నారు.
Steroid Injections: హైదరాబాద్లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ పట్టివేత.. వాళ్లే టార్గెట్
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఎంఐఎం అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. ఏకగ్రీవం అవ్వడానికి బీజేపీ సహకరించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంఐఎం గెలుపు కోసం బీజేపీ పూర్తిగా మద్దతు తెలిపిందని అన్నారు. బీజేపీ పరోక్ష సహకారం అందిస్తే.. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్ష అవగాహన కలిగి ఉన్నాయని చెప్పారు. దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని.. దీనిపై బీజేపీ స్పందించాలని అడిగారు. ఇక హాత్ సే హాత్ జోడో యాత్ర ఎవరు చేసినా తప్పు లేదన్నారు. ఉత్తమ్ చేసినా, మహేశ్వర్ రెడ్డి చేసినా తప్పు లేదని.. తప్పకుండా యాత్రలు చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. ఒకవేళ ఎవరైనా యాత్రలు చేయకపోతే, తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరూ యాత్రలు చేయాల్సిందేనని పిలుపు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. చేయని వారిపై పార్టీ సమీక్షించి, వారిపై తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..
- Tags
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!