Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi Joins Bharat jodo Yatra: కాంగ్రెస్ గత వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ‘ భారత్ జోడో యాత్ర’ చేపట్టింది. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందగ బాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నిడిచారు.
బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ జోడో యాత్ర ప్రారంభంలో అనారోగ్య కారణాల వల్ల ఆమె విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. భారత్ వచ్చాక ఇప్పుడే తొలిసారిగా పాదయాత్రలో పాల్గొన్నారు. గురువారం మాండ్యా జిల్లాలో జరిగిన యాత్రలో సోనియాగాంధీ, కుమారుడు రాహుల్ గాంధీతో జోడో యాత్రలో చేరారు. బళ్లారిలో జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగించే అవకాశం ఉంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
విజయదశమి సందర్భంగా రెండు రోజుల పాటు భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. విరామం తరువాత గురువారం యాత్ర తిరిగి ప్రారంభం అయింది. సోనియాగాంధీతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యే అంజలి నింబార్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రోజు దసరా సందర్భంగా సోనియా గాంధీ మైసూర్ లోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తమిళనాడులో ప్రారంభం అయిన యాత్ర కేరళలో ముగిసి కర్ణాటకలో కొనసాగుతోంది. 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. చామరాజనగర్, మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి మరియు రాయచూరు జిల్లాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. తమిళనాడులో సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఐదు నెలల తర్వాత కాశ్మీర్ లో ఈ యాత్ర ముగుస్తుంది.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..