PM Modi: మోడీ సభలో యువతి హల్ చల్ .. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలో కమిటీ వేస్తామన్నారు. ఇక నుంచి తాను మంద కృష్ణ మాదిగ ఉద్యమంలో ఒకడినని పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ నాయకుడిగా ఉండి ఉంటే ఆమెకు సహాయకుడిగా ఉండేవారని అన్నారు. ప్రధాని మాట్లాడుతుండగా కొన్ని సెకన్ల పాటు సభలో గందరగోళం నెలకొంది. ఒక అమ్మాయి త్వరగా లైట్ టవర్ ఎక్కడం ప్రారంభించింది. ప్రధాని మాట్లాడుతుండగా.. తెల్లటి దుస్తులు ధరించిన ఓ యువతి వీపుపై బ్యాగ్ పెట్టుకుని టవర్ ఎక్కింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆమె టవర్ ఎక్కారు. ఇంతలో ప్రధాని మోడీ వెంటనే అలర్ట్ అయ్యారు. దిగి రావాలని కోరారు. పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయకూడదని మంచిది కాదని, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని ప్రదాని సూచించారు.
‘బిడ్డ దిగి రావాలి. ఇది సరికాదు. నేను మీతో ఉన్నాను. నీ కోసమే ఇక్కడికి వచ్చాను. మీ మాట వినడానికి వచ్చాను. ఇలా చేయడం సరికాదు.. మందకృష్ణ మాట వినాలి’ అని ప్రధాని మోడీ ఆ యువతిని అభ్యర్థించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న కొందరు యువకులు, పోలీసులు ఆమెను కిందకు దించారు. అయితే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆమె స్తంభం ఎక్కి నిరసన తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. మోడీ పాలన వచ్చిన తర్వాత కులం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క మతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని బాలిక ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ పాలనలో అన్నీ ప్రైవేటీకరించబడుతున్నాయని ఆగ్రమం వ్యక్తం చేసినట్లు విశ్వనీయ సమాచారం. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చదువుకోవాలంటే.. లక్షల్లో ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, మాలాంటి పేదలకు మేలు జరగడం లేదని ఆ యువతి చెప్పింది.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
ఇక మాదిగ విశ్వరూప సభలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాన్ని కొనియాడిన మోదీ.. మందకృష్ణ పోరాటానికి ఇప్పుడు మరో మిత్రుడు వచ్చిందన్నారు. మాదిగ వర్గానికి న్యాయం జరిగేలా చూడాలన్నదే తన కోరిక అని మోదీ వెల్లడించారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న మోదీ సమావేశంలో ఆయన లైట్ టవర్ ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.
Bigg Boss 7 Telugu: రతిక ఫెయిల్ కంటెస్టెంట్ అంటూ టార్గెట్ చేసిన ప్రశాంత్.. కెప్టెన్ అయిన శివాజీ..
తాజావార్తలు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?