Hyderabad Crime: ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ మర్డర్ అప్డేట్..! రూంలో బంధించి.. పారతో దాడి
- ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మర్డర్ కేసు..
- సంచలన విషయాలు వెలుగులోకి ..
- గడ్డం మహేష్ ను అతికిరాతకంగా హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను అతికిరాతకంగా దుండగులు హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గడ్డం మహేష్ రూంలో బంధించారు. అంతే కాకుండా చిత్ర హింసలకు గురిచేస్తూ కళ్ళలో కారం చల్లారు. అనంతరం అతనిని పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వారం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.
Read also: Police Firing: సైదాబాదులో పోలీసుల కాల్పులు.. అదుపులో చైన్ స్నాచర్..
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీటీసీ మహేశ్(40) ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహం లభ్యమైంది. పూడ్చిన మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో పంచనామా తర్వాత డంప్ యార్డ్ వద్దే వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. కళ్ళలో కారం చల్లి, పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడని నిర్ధారించారు. డంప్ యార్డ్ లో JCB తో పెద్ద గొయ్యి తవ్వి… కారులో గడ్డం మహేష్ మృతదేహాన్ని ఉంచి కారుతో సహా పూడ్చి పెట్టినట్లు తెలిపారు. JCB తో పోలీసులు వెలికితీశారు. ఎంపీటీసీ మృత దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున డంప్ యార్డ్ వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు గడ్డం మహేశ్ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డులో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్ కుటుంబ సభ్యులకు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేశ్ ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
NTR : హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా..
తాజావార్తలు
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!