Hyderabad Crime: ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ మర్డర్ అప్డేట్..! రూంలో బంధించి.. పారతో దాడి
- ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మర్డర్ కేసు..
- సంచలన విషయాలు వెలుగులోకి ..
- గడ్డం మహేష్ ను అతికిరాతకంగా హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను అతికిరాతకంగా దుండగులు హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గడ్డం మహేష్ రూంలో బంధించారు. అంతే కాకుండా చిత్ర హింసలకు గురిచేస్తూ కళ్ళలో కారం చల్లారు. అనంతరం అతనిని పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వారం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.
Read also: Police Firing: సైదాబాదులో పోలీసుల కాల్పులు.. అదుపులో చైన్ స్నాచర్..
Also Read
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీటీసీ మహేశ్(40) ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహం లభ్యమైంది. పూడ్చిన మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో పంచనామా తర్వాత డంప్ యార్డ్ వద్దే వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. కళ్ళలో కారం చల్లి, పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడని నిర్ధారించారు. డంప్ యార్డ్ లో JCB తో పెద్ద గొయ్యి తవ్వి… కారులో గడ్డం మహేష్ మృతదేహాన్ని ఉంచి కారుతో సహా పూడ్చి పెట్టినట్లు తెలిపారు. JCB తో పోలీసులు వెలికితీశారు. ఎంపీటీసీ మృత దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున డంప్ యార్డ్ వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు గడ్డం మహేశ్ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డులో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్ కుటుంబ సభ్యులకు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేశ్ ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
NTR : హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా..
తాజావార్తలు
-
Box Office Trend :’పెద్ది’ని అధిగమించిన ‘అబ్సెషన్’… హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
-
Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ రిజెక్ట్ చేసి సాయిపల్లవి మంచిపని చేసింది
-
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
-
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదా?
-
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!