Funds Misuse: సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తల నిధుల స్వాహా
అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా గ్రామ పంచాయతీ నిధులు స్వాహా అవుతున్నాయి. స్వయానా సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త లు కుమ్మక్కయ్యారు. వారికి ఓ ప్రజా ప్రతినిధి కూడా మద్దతు ఇవ్వడం, మరో ఉన్నతాధికారి కూడా వారికి వంతపాడడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలసి కోటిన్నర పైగా స్వాహా చేశారు. స్వంత పేర్లతో చెక్కుల ద్వారా డబ్బులు స్వాహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్ మండలంలోని నాగినేని పాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్కామ్ చూస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు ఒక్కటి అయ్యారు. వారి భర్తలమీద చెక్ లను రాయించుకుని స్వాహా చేశారు. ఇద్దరూ కలిసి 116 చెక్ ల రూపంలో కోటి, 27లక్షల 8 వేల 324 రూపాయలు స్వాహా చేసిన అంశం బయటకు పొక్కకుండా బహు జాగ్రత్తగా అధికారులు కూడా సహకరించారు.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
నాగినేనిప్రోలు పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. పంచాయతీ అభివృద్ధి పనుల పేరిట సుమారు కోటిరూపాయలకు పైగా నిధులను భర్తల పేరిట డ్రా చేశారు సర్పంచ్ శ్రావణి, ఉపసర్పంచ్ ఝాన్సీ లక్ష్మీలు. వారు భర్తల పేరిట చెక్కులను రాసి ప్రజల సొమ్మును స్వాహా చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఇక్కడ ఉన్న ఓ ప్రజా ప్రతినిధి , ఉన్నత స్థాయి అధికారి కూడా వారికి మద్దతు ఇచ్చారని తెలుస్తోంది. ఇంకేముంది ఆ నిధుల స్వాహా వ్యవహారాన్ని బయట పడకుండా ఆ జిల్లా అధికారులు కూడా సహకరించారన్న అరోపణలు ఉన్నాయి.
నిధులు దుర్వినియోగం జరిగాయని గతంలోనే జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వగా ఆరు నెలల క్రితమే సర్పంచ్, ఉప సర్పంచ్ లకు జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసు ఇచ్చినప్పటికీ అవి మాత్రం మీడియాకు ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అక్రమాలు జరిగాయని 2021 జూన్ లోనే మండల అధికారులు నివేదిక సమర్పించినప్పటికి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నుంచి ఓ ఉన్నతాధికారి అదే విధంగా జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి అడ్డకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వారిద్దరి వల్ల జిల్లా అధికారులు ఇంత కాలం చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తూ తూ మంత్రంగా చర్యలను ప్రారంభించారు. వాస్తవానికి పదవులనుంచి తొలగించాల్సి ఉండగా వారిని కేవలం మూడు నెలల పాటు తొలగిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి జిల్లా అధికారులను వివరణ అడిగితే మీడియాకు సమాచారం ఇవ్వవద్దని ఆదేశాలు ఉన్నాయని మేం మీడియా ముందు మాట్లాడమని అధికారులు చెబుతూ దాటవేస్తున్నారంటే వారి మీద అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!