Fraud: దీపం వత్తులు, బొట్టు బిళ్ళల పేరుతో మోసం.. రూ.200 కోట్లు కొట్టేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. హీనంగా చూడకోయ్ దేన్నీ.. కవితామాయయేనోయ్ అన్నీ.. తలుపుగొళ్ల, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం.. కాదేదీ కవితకు కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు.. కేటుగాళ్లు.. ఇదే ఫాలో అవుతున్నారు.. కాకపోతే కవితలు కాదు.. మోసాలు.. బ్యాంకులు, వ్యాపారులకు, వ్యాపారులతో పేరుతో ప్రజలకు.. ఇలా చిన్నస్థాయి నుంచి.. పెద్ద స్థాయి వరకు ఎవరినీ వదలకుండా.. కోట్లకు కోట్లు లాగేస్తున్నారు. ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదన మార్గం, ప్రభుత్వోద్యోగాల పేరుతో కొందరు, కరక్కాయలు పొడి చేసి ఇస్తే భారీగా డబ్బిస్తామంటూ మరికొందరు.. ఇలా ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు కొట్టేస్తున్న కేటుగాళ్లు ఎందరో.. తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.. దీపం వత్తులు, బొట్టు బిల్లల పేరుతో ఏకంగా రూ.200 కోట్లు టోకరా పెట్టాడు.
Read Also: Raja Singh: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రాజా సింగ్.. సర్జరీ చేసిన వైద్యులు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
దీపం వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని.. బొట్టు బిల్లల తయారీ యంత్రంతో పాటు.. ముడి సరుకులు మేమే ఇస్తామని ఎంతో మందిని బుట్టులో వేసుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా రూ.200 కోట్లు మోసం చేశాడు.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడలో ఈ భారీ మోసం వెలుగు చూసింది.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యికిపైగానే బాధితులు ఉన్నారంటే.. మోసం ఏస్థాయిలో అర్థం చేసుకోవచ్చు.. ఏఎస్ రావు నగర్కు చెందిన రమేష్ అనే వ్యక్తి ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు..
దీపం వత్తులు, బొట్టు బిల్లల తయారీ యంత్రాలతో పాటు.. ముడి సరుకు తానే ఇస్తానని నమ్మబలికాడు.. అంతేకాదు, తను ఇచ్చే ముడి సరుకు తయారు చేసి ఇస్తే.. డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చారు.. ఇది నమ్మిన ప్రజలు.. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. ఇలా ప్రారంభమై.. దాదాపు 1100 మంది వరకు చేరారు.. మొత్తంగా దీపం వత్తులు, బొట్టు బిల్లల తయారీ పేరుతో ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు.. కొంతకాలం ఈ వ్యవహారం సాగినా.. ఆ తర్వాత చేసి చెత్తులెత్తేశాడు.. అయితే, ఇటీవల కంపెనీ బోర్డ్ తీపివేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.. వారి పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!