Wanaparthy: కస్తూర్బాలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. విద్యార్థునిలను పాఠశాల యాజమాన్యం ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిన్న ఆహారంతోనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థినిలు తెలిపారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు అధికారులు. హుటా హుటిన తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థినుల పరిస్థితి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు బాధతో కడుపు పట్టుకుని ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం కారంగానే తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుప్రతి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Pooja Hegde : వైట్ పూల డ్రెస్సులో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే..
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తాజాగా మహబూబాబాద్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాత్రి భోజనానికి తయారు చేసిన టమోటా వంటకం తినడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు, సంబంధిత విద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేజీబీవీ అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
LIC: ఎల్ఐసీ ఆస్తులు 45 లక్షల కోట్లు.. కంపెనీ మీ డబ్బుతో ఏమి చేస్తుంది?
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!