Wanaparthy: కస్తూర్బాలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. విద్యార్థునిలను పాఠశాల యాజమాన్యం ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిన్న ఆహారంతోనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థినిలు తెలిపారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు అధికారులు. హుటా హుటిన తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థినుల పరిస్థితి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు బాధతో కడుపు పట్టుకుని ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం కారంగానే తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుప్రతి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Pooja Hegde : వైట్ పూల డ్రెస్సులో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే..
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
తాజాగా మహబూబాబాద్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాత్రి భోజనానికి తయారు చేసిన టమోటా వంటకం తినడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు, సంబంధిత విద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేజీబీవీ అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
LIC: ఎల్ఐసీ ఆస్తులు 45 లక్షల కోట్లు.. కంపెనీ మీ డబ్బుతో ఏమి చేస్తుంది?
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్కు రెడీగా ఉండండి!
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!