Children Drown: ఫంక్షన్లో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Five Children And A Man Drown In Medchal Malkaram Lake: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్లో విషాదం చోటు చేసుకుంది. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈత కొట్టేందుకు ఆరుగురు చిన్నారులు వెళ్లగా.. వారిలో ఐదుమంది మృతి చెందారు. వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ ఆటో డ్రైవర్ సైతం చెరువులో మునిగి మరణించాడు. జవహర్నగర్లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు ఒక కుటుంబం హాజరయ్యింది. ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు.. పక్కనే ఉన్న చెరువు కనబడగానే, సరదాగా ఆడుకుందామని వెళ్లారు. అయితే.. ఈత రాకపోవడంతో ఐదుగురు పిల్లలు దుర్మరణం చెందారు. వీరికి కాపాడేందుకు అదే కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ చెరువులో దూకగా.. ఆయన కూడా మృతి చెందాడు. ఒక అబ్బాయిని మాత్రం స్థానికులు కాపాడారు.
మృతి చెందిన పిల్లల వయసు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే.. క్షేమంగా బయటపడ్డ అబ్బాయిని, చికిత్సం నిమిత్తం దగ్గరలోనే ఆసుపత్రికి చేర్పించారు. మృతి చెందిన వారంతా.. అంబర్పేట్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఏసీపీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు విగతజీవులుగా తిరిగి రావడంతో.. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో తమకు ఆసరాగా ఉంటారనుకున్న పిల్లలు ఇప్పుడు లేరన్న విషయం తెలిసి రోదిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!